Prashanth Neel: సినిమా ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ లను సాధిస్తారు. ఎవరు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతారు అనేది చెప్పడం చాలా కష్టం…కానీ టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతారనేది వాస్తవం…వారసత్వం ఉన్నప్పటికి ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ ‘ఉగ్రం’ సినిమాను చేసి సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘కేజిఎఫ్’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే కాకుండా పాన్ ఇండియాలో ఈ సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. దాదాపు 600 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక రెండో పార్ట్ 1300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలతో పాటు మరోసారి ఆయన ప్రభాస్ ని హీరోగా పెట్టి చేసిన సలార్ సినిమా 800 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన సలార్ 2 సినిమాలో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది.
సలార్ 2 పూర్తయిన తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. కారణం ఏంటంటే ప్రశాంత్ నీల్ సినిమాలు లో లైటింగ్ లో చాలా వైలెంట్ గా ఉంటాయి.
అలాగే ఎలివేషన్స్ సైతం టాప్ రేంజ్ లో ఉంటాయని అంతటి ఎలివేషన్స్, అలాగే అలాంటి లో లైటింగ్ మహేష్ బాబు ఇమేజ్ కి సెట్ అవ్వదని ఆయన అలాంటి సినిమాలను చేస్తే తన ఫ్యాన్స్ కూడా తన సినిమాలు చూడరేమో అని ఒక డైలామాలో మహేష్ బాబు ఉన్నాడట. మొత్తానికైతే రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది దాన్ని బట్టి సినిమాలను ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
