క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో రానున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె యువరాణిగా కనిపిస్తుందట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆమె పాత్ర సెకెండ్ హాఫ్ లో చనిపోతుందని, ఆమె చనిపోయే ఎమోషనల్ సీన్ సినిమాలోనే కీలకం అని తెలుస్తోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందట.
మరి ఇంతకీ ఆ రాజు ఎవరు? ఆ పీరియాడిక్ డ్రామా ఏమిటి? అనేది చూడాలి. ప్రస్తుతానికి, ఈ చిత్రం అయితే పాన్-ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఓ చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పీవీపీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని సినిమా చేయడానికి పవన్ నుండి కూడా సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయట. ఏమైనా పవన్ నుండి ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన పవర్ స్టార్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Pawan kalyan krish movie latest updates 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com