కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుంటే రామ్గోపాల్ వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తున్నాడు. లాక్డౌన్ టైమ్లోనే క్లైమాక్స్, నేక్డ్ మూవీలు షూట్ చేసి డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశాడు. కరోనా టైమ్లోనే ‘కరోనా వైరస్’ మూవీ కూడా చిత్రీకరించాడు. ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా మర్డర్, గాంధీని చంపిన గాడ్సే జీవితం ఆధారంగా ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ, కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్, పవర్ స్టార్ అనే చిత్రాలను అనౌన్స్ చేశాడు. ఆపై తన మార్కు హర్రర్ జోనర్లోకి వెళ్లి రెండు రోజుల కిందట 12 ఓ క్లాక్ అనే మూవీ ట్రైలర్తో ఫ్యాన్స్ను భయపెట్టాడు.