Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన మహేష్ బాబు..సోషల్ మీడియా ని ఊపేస్తున్న...

Mahesh Babu: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన మహేష్ బాబు..సోషల్ మీడియా ని ఊపేస్తున్న న్యూ లుక్!

Mahesh Babu: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో వరదలు సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆస్తి నష్టంతో పాటుగా, ప్రాణ నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా విజయవాడ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించి సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా వరకు విజయవాడ ప్రాంతం వరద నుండి కోలుకుంది. కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాలు వరద నీటి నుండి పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇదంతా పక్కన పెడితే వరద నేపథ్యం లో సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులందరూ తమ వంతు సహాయంగా భారీ విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయిల విరాళం అందించగా, ప్రభాస్ రెండు కోట్లు, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయిలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, తన భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి 50 లక్షల రూపాయిల చెక్ ని అందించారు. రేవంత్ రెడ్డి మహేష్ బాబు దంపతులను ఎంతో ఘనంగా స్వాగతించి, సత్కరించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ వీడియో లో మహేష్ బాబు లుక్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆయన మీసం, గెడ్డం లేకుండానే కనిపించేవాడు. కొన్ని సినిమాల్లో సన్నని మీసం తో కనిపించేవాడు. కానీ ఈరోజు ఆయన పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం తో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసాడు. ఇది రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ అన్నమాట. గెడ్డం ఇంకా కాస్త పెంచే అవకాశాలు కూడా ఉన్నాయట. ఈ లుక్స్ ని చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం మహేష్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ ని కూడా పెంచుతున్నాడట.

సినిమాలో ఆయన షర్ట్ లెస్ సన్నివేశాల్లో కూడా కనిపించబోతున్నట్టు టాక్. ఇలా కెరీర్ లో ఎన్నడూ చేయనటువంటివి ఈ సినిమాలో చేయిస్తున్నాడు రాజమౌళి. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ 200 ఏళ్ళ కృతానికి సంబంధించినది గా ఉంటుందట. ఇందులో పాన్ ఇండియన్ లెవెల్ లో సూపర్ స్టార్స్ అందరూ నటిస్తారని టాక్. అంతే కాదు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈ చిత్రం లో మహేష్ బాబు కి తండ్రి పాత్రలో కనిపిస్తాడట. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ ఇందులో విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకోనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular