చిత్రసీమలో విచిత్రాలకు కొదవుండదు. కొందరికి స్టార్ డం వచ్చాక కూడా ప్రత్యేక పాత్రల్లో అతిధిగా నటించాల్సి రావచ్చు. అలాంటి సందర్భం ఈ మధ్య ఇద్దరి హీరోయిన్ లకు వచ్చింది. కాగా వాళ్లిద్దరూ స్టార్ హీరోయిన్ లు కావడం విశేషం. ఇక్కడున్నఇంకో ట్విస్ట్ ఏమిటంటే వాళ్లిద్దరూ మెగా హీరోల చిత్రాల్లో అలా నటించారు. ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన స్టార్ బ్యూటీ మరో చిత్రం లో స్పెషల్ సాంగ్ లో నటించింది .
2017 జూన్ 23 వ తారీఖున విడుదలైన ” డీజే ” (దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో బన్నీ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ తరవాత మార్చ్ 30 , 2018 లో విడుదలైన “రంగస్థలం” చిత్రం లో రామ్ చరణ్ పక్కన ` జిగేల్ రాణి ` అనే ప్రత్యేక గీతంలో నర్తించింది. అలా పూజా హెగ్డే అల్లు అర్జున్ సరసన `డీజే `చిత్రం లో హీరోయిన్ గా నటించి చెర్రీ సరసన `రంగస్థలం` చిత్రం లో ప్రత్యేక గీతం లో ఆడి పాడింది
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. త్వరలో సెట్స్ మీదకి వెళ్లే బన్నీ , సుకుమార్ కాంబో సినిమా” పుష్ప” లో ఓ స్పెషల్ సాంగ్ కోసం రామ్ చరణ్ హీరోయిన్ , ముంబై బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలి అనుకొంటున్నారు. కియారా అద్వానీ అంతకు ముందు 2019 లో రామ్ చరణ్ సరసన ” వినయ విధేయ రామ ” చిత్రం లో హీరోయిన్ గా నటించింది. “పుష్ప” పాన్ ఇండియా చిత్రం కాబట్టి కియారా అద్వానీ స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.
ఆ లెక్కన ” రంగస్థలం ” చిత్రం లో బన్నీ హీరోయిన్ పూజాహెగ్డే డాన్స్ చేస్తే , ఇపుడు ” పుష్ప ” చిత్రం లో రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేయబోతోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఈ రకమైన ప్రయోగాలు రెండూ సుకుమార్ దర్శకత్వంలోనే సంభవించాయి .
ఆర్య సిరీస్ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో మూడోచిత్రం గా వస్తున్న ” పుష్ప” మూవీ శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kiara advani special song in pushpa movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com