సినీ కార్మిక రంగం లో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి లో ఎందరో ఉన్నారు వాళ్లకు . షూటింగ్ ఉంటేనే నాలుగు వేళ్ళు లోపలికి వెళతాయి. లేదంటే ఆ రోజు పస్తు పడుకోవాల్సిందే. రోజువారీ బేటాలే వారి సంపాదన. నెలవారీ జీతం లాంటివి ఏమీ వుండవు. ఇది నూటికి తొంబై మంది సినీ కార్మికుల దైనందిన జీవిత చక్రభ్రమణం అందులో ఎపుడైనా గతి తప్పిందా వారి భాదలు చెప్ప నలవి కాదు. షూటింగ్ ఉంటేనే కడుపు నిండుతుంది. లేదంటే ఆకలితో అలమటించాల్సిందే … అలాంటి కార్మికులు కరోనా తో ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి భరోసా ఇవ్వడానికి మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యం లో సి .సి . సి(కరోనా క్రైసిస్ చారిటీ ) ఏర్పాటైంది.దీనికి తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో స్పందించి భారీగా విరాళాలు ఇస్తున్నారు.
ఇపుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇంతవరకు విరాళాలు ఇచ్చిన వారికి అదనంగా కొంతమంది తెలుగు హీరోలు , కెమెరా మాన్ లు కూడా జత కలిశారు. వివరాల్లోకి వెళ్తే హీరో నాని 30 లక్షలు ,ఇవ్వగా నాగార్జున మేనల్లుడు ఆల వైకుంఠపురంలో ఫేమ్ సుశాంత్ 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక కమెడియన్ కం హీరో సప్తగిరి 2 లక్షలు ఇవ్వగా , సీనియర్ నటుడు మరియు హీరో అయినా శ్రీకాంత్ 5 లక్షలు ఇచ్చి తన వంతు ఉదారత చాటుకున్నాడు.
ఇక వర్ధమాన హీరో , కెమెరా మాన్ చోటా కె నాయుడుకి మేనల్లుడు అయిన సందీప్ కిషన్ 3 లక్షలు ఇవ్వడమే గాక తన వద్ద రెస్టారెంట్ లో వాటిల్లో పనిచేసే 500 మంది కార్మికులకు ఉచిత ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక చోటా హీరో సంపూర్ణేష్ బాబు 1 లక్ష రూపాయలు ఇవ్వగా , నటుడు బ్రహ్మాజీ 75,000 ఇవ్వడం జరిగింది.
ఇక తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కెమెరా మాన్ స్థానం లో ఉన్న సమీర్ రెడ్డి మరియు మూరెళ్ళ ప్రసాద్ చెరో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ వారు అక్షరాలా 10 లక్షలు ఇచ్చారు. కాగా ఇంతవరకు సి సి సి కి విరాళాల రూపంలో అందిన మొత్తం 6 కోట్ల 2 లక్షలు అని తెలుస్తోంది charity never has an end