Homeఎంటర్టైన్మెంట్Directors at a night party: నైట్ పార్టీలో దర్శకులు.. ఫోటోలు తీసిన మాజీ...

Directors at a night party: నైట్ పార్టీలో దర్శకులు.. ఫోటోలు తీసిన మాజీ హీరోయిన్ !

Telugu Directors night partyDirectors at a night party: భారతీయ సినీ లోకంలో బాలీవుడ్ (Bollywood) దర్శకులకు మొదటి నుండి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ కాలం మారింది, ఇప్పుడు హిందీ జనాలకు తెలుగు దర్శకులు బాగా నచ్చుతున్నారు. అందుకే, బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే తమకంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఆ గ్రూప్ లోని సభ్యులు అంతా కలిసి కూర్చుని తరుచూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఈ గ్రూప్ కి హెడ్ పూరి జగన్నాధ్. పూరి విజయ్ దేవరకొండతో “లైగర్” అంటూ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పూరితో పాటు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కరణ్ జోహార్ కూడా నిర్మాతగా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే, కరుణ్ జోహార్, పూరికి ఒక ఆఫీస్ ఇచ్చాడు. పూరి ప్రస్తుతం తన మకాంను ఆ ఆఫీస్ కే మార్చాడు. అయితే, ముంబైకి వచ్చిన ప్రతి తెలుగు దర్శకుడికి ఇప్పుడు ఈ ఆఫీస్ ఒక అడ్డా అయిపోయింది. సరదాగా కూర్చుని పిచ్చాపాటి మాటలు కబుర్లు మాట్లాడుకుంటూ పూరితో కలిసి హ్యాపీగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు.

ఇంతకీ పూరి జగన్నాధ్ తో ముంబైలో కలిసి ముచ్చట్లు పెట్టిన ఆ దర్శకులు ఎవరంటే.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా, హేమంత్ మధుకర్ లు పూరి ఇచ్చిన పార్టీను ఎంజాయ్ చేశారు. ఇంతకీ క్రిష్ ముంబైకి ఎందుకు వెళ్ళాడు అంటే.. ఓ హిందీ సినిమాకి ఆయన కమిట్ అయ్యాడట.

అలాగే మోహన్ రాజా చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమా కోసం నటీనటులను ఫైనల్ చేయడానికి ముంబై వెళ్లారు. ఇక అనుష్కతో నిశ్శబ్దం సినిమా తీసిన హేమంత్ మధుకర్ ప్రస్తుతం సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నట్టు ఈ దర్శకులంతా కలిసి ఉండగా వీరి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో తెలుసా ? బబ్లీ బ్యూటీ ఛార్మి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular