గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆరేళ్లలో దేశం 8 శాతం వృద్ధి రేటు సాధించింది. దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాం. కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైంది. కరోనా కాలంలోనూ రాష్ట్రం పాజిటివ్ వృద్ధి రేటు సాధించిందని హరీశ్ రావు అన్నారు.