Dil Raju: తెలుగులో భారీ ప్రొడ్యూసర్ గా పేరుపొందిన దిల్ రాజు భారీ సినిమాలను తీయడమే కాకుండా వేరే హీరోల సినిమాలని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. తను ప్రొడ్యూసర్ అవ్వకముందు ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో దిల్ రాజు చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. దిల్ రాజు బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ప్రొడ్యూసర్ గా మారి దిల్ అనే సినిమా చేశాడు.
ఆ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఆయన పేరు కి ముందు దిల్ అని యాడ్ చేసి దిల్ రాజుగా మారాడు… ఇక ఇప్పుడు సంక్రాంతి కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అందులో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమా కి 90 సింగిల్ స్క్రీన్ లని దిల్ రాజు కేటాయిస్తున్నట్లు గా తెలుస్తుంది.
మొత్తం హైదరాబాద్ లో 96 సింగిల్ స్క్రీన్స్ ఉండగా, అందులో 90 స్క్రీన్స్ గుంటూరు కారం సినిమా కోసమే వేస్తుండడం విశేషం…ఇంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఇంత భారీ రేంజ్ లో థియేటర్లని కేటాయించారు.ఆ రికార్డ్ ను బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యం తోనే దిల్ రాజు ఈ సినిమా కోసం భారీ స్క్రీన్ లని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ ఓపెనింగ్స్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే దిల్ రాజు ఇన్ని ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ప్రీమియర్ షోల విషయానికి వస్తే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ సినిమా ప్రీమియర్ షో నడువనున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆ తర్వాత తేజ సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ సినిమా ప్రీమియర్స్ అనేవి పడతాయి.ఇలా దిల్ రాజు తన బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తూ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటాడు కాబట్టే అతనికి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయంటూ ట్రేడ్ పండితులు ఇప్పటికే చాలాసార్లు తెలియజేశారు. ఇక తన సినిమాలు రిలీజ్ చేసుకోవడం కోసం దిల్ రాజు ఎలాంటి ప్లాన్స్ అయిన వేస్తాడు. మొత్తానికైతే తన సినిమా కి ఎక్కువ స్క్రీన్స్ వచ్చేలా చూసుకుంటాడు ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ని మెయింటైన్ చేస్తున్నాడు…