Dil Raju , Allu Arjun
Dil Raju and Allu Arjun : టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు(Dil Raju). మీడియం రేంజ్ బడ్జెట్ తో భారీ లాభాలను అందుకుంటూ, మన తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను అందించాడు. టాలీవుడ్ వరకు పరిమితమై సినిమాలు తీస్తున్నంతసేపు ఆయన సక్సెస్ లోనే ఉన్నాడు కానీ, తన పరిధి ని పెంచుకునే ప్రక్రియలో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లాలని ప్రయత్నాలు చేసి వరుసగా చేతులు కాల్చుకుంటున్నాడు. రీసెంట్ గానే ఆయన రామ్ చరణ్(Global Star Ram Charan), శంకర్(Shankar Shanmugham) కాంబినేషన్ లో తీసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం(Game Changer Movie) సంక్రాంతికి కానుకగా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవాలను అభిమానులు మర్చిపోలేరు, జీవితంలో మర్చిపోలేరు కూడా. ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) కారణంగా ఆర్ధిక నష్టాల నుండి తప్పించుకున్నాడు కానీ, భారీ లాభాలను మాత్రం ఆర్జించలేకపోయాడు.
Also Read : ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ‘Unfollow’ కొట్టిన రామ్ చరణ్..వివాదం తారాస్థాయికి చేరిపోయిందిగా!
‘గేమ్ చేంజర్’ కి ముందు కూడా ఆయన బాలీవుడ్ ‘జెర్సీ’, ‘హిట్’ సినిమాలను రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఒక తమిళంలో మాత్రం విజయ్(Thalapathy Vijay) తో ‘వారిసు’ సినిమా తీసి సూపర్ హిట్ ని అందుకున్నాడు. మిగిలిన పాన్ ఇండియన్ సినిమాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన పాన్ ఇండియన్ సినిమాల వైపే ఆలోచించకుండా, తనకి కలిసొచ్చిన మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల వైపే ఫోకస్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) దిల్ రాజు కి ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించుకున్నాడు. చాలా సేపటి వరకు వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అల్లు అర్జున్ దిల్ రాజుకి మాట ఇస్తూ కచ్చితంగా భవిష్యత్తులో ఇద్దరం కలిసి సినిమా చేద్దామని అన్నాడట. ఈ చిత్రానికి ఎలాంటి అడ్వాన్స్ వద్దని, సినిమా విడుదల అయ్యాక లాభాలు వస్తే తీసుకుంటానని చెప్పాడట అల్లు అర్జున్.
దిల్ రాజు కి మాత్రమే ఎందుకు ఆయన అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడంటే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అంశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వానికి, అల్లు ఫ్యామిలీ కి మధ్య వారధిగా నిల్చి, ఆ సమస్య ముదరకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం లో సహాయపడ్డాడు. అందుకే దిల్ రాజు పై అల్లు అర్జున్ ఎంతో ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాడు. ఆయన చూపించిన ఈ చొరవకు కృతజ్ఞతగా ఒక సినిమా చేసి పెడతానని మాట ఇచ్చాడట. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో, మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ ఖాన్స్ కి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దిల్ రాజు ఈ లెక్కన జాక్పాట్ కొట్టినట్టే. 2027 వ సంవత్సరం లో ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా..మరో సరికొత్త ప్రయోగం..ఈసారి మిస్ అయితే అవుట్!
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Dil raju allu arjun bumper offer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com