కరోనా మహమ్మరి ఉసరివెల్లిలా రంగుమారుస్తూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ఏదో ఒకరూపంలో వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇందులో కొందరు మృత్యువాత పడుతుండగా మరికొందరు కరోనాను జయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: ‘గమనం’ ట్రైలర్: వరదలా ఉప్పొంగిన ఎమోషన్..!
కరోనా వైరస్ చిన్న..పెద్ద, ధనిక, పేద అనే తేడాల్లేకుండా అందరిపై తన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సెలబ్రెటీలు ఏసీ రూముల్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసకుంటున్నప్పటికీ కరోనా బారినపడుతున్నారు. ఇటీవలే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం కరోనా బారినపడి మనందరికీ దూరమయ్యారు.
ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారినపడింది. రాజశేఖర్ భార్య జీవిత, కుమార్తులు శివాత్మిక, శివానీలు కరోనాను త్వరగా జయించగా రాజశేఖర్ మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. డాక్టర్ల సహకారంతో ఇటీవలే కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: విజయ్ దేవరకొండ సినిమాలో మలయాళ హీరో !
ఇదిలా ఉంటే ‘ఆచార్య’ షూటింగు కోసం మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో టాలీవుడ్లో ఆందోళన మొదలైంది. అయితే ఆయన కరోనా లక్షణాలు లేవని.. తాను హోం క్వారంట్లోని వెళుతున్నానని.. గత నాలుగు రోజులుగా తనను కలిసి వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని చిరంజీవి ఓ లేఖలో కోరారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
చిరంజీవి కరోనా బారిన పడటానికి ముందే హీరో నాగార్జునతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ను కలిశాడు. వరద బాధితుల సహాయార్థం వారిద్దరు సీఎం రీలీఫ్ ఫండ్ కు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎంతో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా నాగార్జున కరోనా టెస్టులు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్ కూడా నెగిటివ్ వచ్చినట్లు సమాచారం.