నటసింహం బాలయ్య బాబు(Balayya) సినిమా అంటేనే.. రొటీన్ యాక్షన్ తో పాటు అవే బిల్డప్ షాట్స్, అవే మాస్ డైలాగ్స్ ఉంటాయి. దీనికి తోడు రొటీన్ కథ. ఆ కథలో మళ్ళీ కామన్ పాయింట్… సమాజంలో ఏదో అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి మన బాలయ్య బాబుగారు ఎంట్రీ ఇస్తారు.
ఎంట్రీలోనే రెచ్చిపోయి విలన్లను నరికేసి న్యాయాన్ని గెలిపిస్తారు. బాలయ్య సినిమాలు అన్నీ అటుఇటుగా ఇదే కథతో సాగుతాయి. ఈ పరమ రొట్ట కొట్టుడు కథలకు, ఇకనైనా నటసింహం ఎండింగ్ కార్డు ఇస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు గత పదిహేను ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఓ దశలో ఈ రొటీన్ సినిమాల కారణంగా బాలకృష్ణ సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయినా బాలయ్య మాత్రం తన సినిమాల శైలిలోనే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం బోయపాటితో చేస్తోన్న అఖండ(Akhanda) సినిమా కూడా పూర్తి యాక్షన్ సినిమానే. అందుకే, బాలయ్యతో కొత్త రకం సినిమా చేయడానికి పూనుకుంది సితార సంస్థ.
అంటే.. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ సినిమా చేయాలని సితార ప్లాన్. నిజానికి మంచి కథలతో ఎమోషనల్ మూవీస్ అందిస్తోంది అంటూ టాలీవుడ్ లో సితార సంస్థకి మంచి క్రెడిబులిటీ ఉంది. కాబట్టి, బాలయ్యతో అలాంటి ఒక ఎమోషనల్ డ్రామాను చేయడానికి కసరత్తులు చేస్తోంది. బాలయ్య వైపు నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టాక్. అందుకే, ప్రస్తుతం సితార సంస్థ కథలు వింటుంది.
కొత్త నేపథ్యంలో సినిమా చేయాలని సితార సంస్థ టార్గెట్. అలాగే పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ సరికొత్త కథ కోసం కూడా సితార వెతుకుతుంది. మొత్తానికి బాలయ్య – సితార నుంచి కొత్త రకం సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Balakrishna gave green signal to sitara entertainments banner
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com