తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి `వకీల్ సాబ్ ` కాగా రెండోది ఒక పిరియాడికల్ మూవీ. . పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన పండగ సాయన్న అనే ఒక పోరాటా యోధుడి కథ ఇది అని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నిర్మించ బడే ఈ పిరియాడికల్ మూవీని గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ క్రిష్ రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా ఇది నిజాం కాలంతో ముడిపడిన కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో పవర్ స్టార్ బందిపోటు గా నటిస్తాడని , రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని అంటున్నారు.
ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను రక రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒక దశలో కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఆ తరువాత బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండేజ్ పేరు తెరపైకి వచ్చింది. ఇక జాక్విలిన్ ను ప్రత్యేకమైన పాట కోసం గానీ ..ప్రత్యేక పాత్ర కోసం గాని తీసుకున్నారేమో అంటున్నారు.అలాగే ఒక ప్రత్యేక పాటకోసం తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ని కూడా తీసుకోవడం జరిగింది. ఆమెపై ఒక పాట కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కథానాయికగా తాజాగా అనుష్క పేరు వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క ‘వేదం’ సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమాలో అనుష్క అయితే సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో క్రిష్ ఆమెను తీసుకున్నాడని అంటున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Anushka shetty to star in pawan kalyan krish film
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com