Homeఎడ్యుకేషన్AP 10Th Result : ఏపీ చరిత్రలోనే అత్యధిక మార్కులు.. 600కి 599 మార్కులు.. ఏవరీ...

AP 10Th Result : ఏపీ చరిత్రలోనే అత్యధిక మార్కులు.. 600కి 599 మార్కులు.. ఏవరీ అమ్మాయి

AP 10Th Result : ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో రికార్డు బ్రేక్ చేసింది ఓ బాలిక. ఇప్పటివరకు నమోదు కానీ రికార్డును.. ఇకముందు నమోదుకు అవకాశం లేని ట్రాక్ రికార్డును ఆమె సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగుతోంది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన ఆకుల వెంకట సాయి మనస్వి ఈ ఘనత సాధించింది. సోమవారం 10వ తరగతి ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మనస్వి 600 మార్కులకు గాను 599 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆమెకు ఒక్క సెకండ్ లాంగ్వేజ్ లో తప్ప.. మిగిలిన సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధించింది. 599 మార్కులతో సాయి మనస్వి ఏపీ పదో తరగతి ఫలితాల్లో టాపర్ గా నిలిచినట్లు ఎస్ ఎస్ సి బోర్డు ప్రకటించింది.

రాష్ట్రస్థాయిలో ప్రధమురాలిగా నిలిచిన మనస్వి రికార్డును ఇప్పట్లో ఎవరూ అధిగమించే ఛాన్స్ లేదు. అలా రికార్డు బ్రేక్ చేయాలంటే 600కు 600 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదంటున్నారు విద్యా నిపుణులు. అయితే మనస్వి మరో రికార్డు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మార్కులు సాధించిన ఏకైక విద్యార్థిగా కూడా మనస్వి నిలుస్తుంది. 2022లో స్టేట్ టాపర్ మార్కులు 598 కాగా..2023లో మాత్రం 597 మార్పులుగా నమోదయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా మనస్వి 599 మార్కులు సాధించడం విశేషం. మనస్వి గత రికార్డులను బద్దలు కొట్టడమే కాదు. తనకు ఎవరూ చేరుకోలేనంతగా మార్కులు నమోదు చేసుకున్నారు. ఇప్పట్లో ఆమె రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నూజివీడు పట్టణానికి చెందిన మనస్విది ఒక సాధారణ కుటుంబం. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వారిచ్చిన ప్రోత్సాహంతోనే మనస్వి ముందుకు వెళ్లారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించాలని భావించింది. కానీ ఏకంగా రాష్ట్ర టాపర్ గా నిలిచింది. అయితే దీని వెనుక మనస్వి కఠోర శ్రమ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి సిలబస్ ను అప్పుడే పూర్తి చేయడం మనస్వికి ఇష్టమైన ప్రక్రియగా తల్లిదండ్రులు చెబుతున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి చదువుకునేదని చెప్పుకొస్తున్నారు. ఆమెకు క్రికెట్ అంటే ఎనలేని ఇష్టం. విరాట్ కోహ్లీ అభిమాన ఆటగాడు. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఐఐటీలో ఇంజనీరింగ్ చేసి.. మంచి ఉద్యోగం పొందాలన్నదే లక్ష్యం అని మనస్వి చెబుతోంది. సో మనస్వికి అందరి తరపున ఆల్ ది బెస్ట్ చెబుదాం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular