spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Mega DSC : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. కీలక ప్రకటన చేసిన...

AP Mega DSC : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. కీలక ప్రకటన చేసిన సీఎం

AP Mega DSC  : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగాయి. ఈ సమయంలో ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే పెడతానని ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. 2024 జూన్‌ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డీఎస్సీ(DSC) ఫైల్‌పై సంతకం కూడా చేశారు. పది నలలు గడిచాయి నోటిఫికేషన్‌ మాత్రం రాలేదు. దీంతో నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఈతరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్‌ మొదటి వారంలో(APril First Week) మెగా డీఎస్సీ (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రకటించారు. ఈ నోటిఫికేషన్‌(Notification)ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియను జూన్‌ నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు పూర్తి చేసి, నియామకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్చి 25, సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read : 75% హాజరు తప్పనిసరి, కఠిన నిబంధనలతో విద్యార్థులకు సవాల్‌

ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా లేదు..
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదని, నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిందని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాను మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశానని, ఇప్పుడు దానిని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(SGT), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (PGT), స్కూల్‌ అసిస్టెంట్స్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను నిర్వహించి, అవకతవకలకు తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

చిగురించిన ఆశలు..
ఈ ప్రకటనతో రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. అయితే, కొందరు ఆకాంక్షితులు ఎక్స్‌ వేదికగా తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లోనే పరీక్షలు నిర్వహిస్తే తమపై ఒత్తిడి పెరుగుతుందని, పరీక్షలను జూలై లేదా ఆగస్టు నెలలో నిర్వహించాలని కోరుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ, ఎన్నికల కోడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read : ‘ఈనాడు’ పై మారుతున్న టిడిపి అభిప్రాయం.. ఎమ్మెల్యేల హెచ్చరికలు!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper