Homeబిజినెస్Saving Account : పొదుపు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసుకోవడానికి పరిమితి ఎంత ఉంటుందో తెలుసా.....

Saving Account : పొదుపు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసుకోవడానికి పరిమితి ఎంత ఉంటుందో తెలుసా.. లేకపోతే ఆదాయపు పన్ను శాఖా నుంచి నోటీసు తప్పదు..

Saving Account :  ప్రతి ఒక్కరికి బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉంటుంది. తమ పొదుపు ఖాతాల్లో చాలామంది డబ్బులను డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పొదుపు ఖాతాలకు కూడా నిబంధనలు ఉంటాయి అన్న సంగతి మనలో చాలామందికి తెలియదు. బ్యాంకులో ఉండే పొదుపు ఖాతాల్లో పరిమితికి మించి ఎవరైనా లావాదేవీలు చేసినట్లయితే అటువంటి వారికి ఆదాయపు పన్ను శాఖ వారు నోటీసు పంపిస్తారు. అలా వచ్చిన నోటీస్ కు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసుకోండి. చాలామంది తమ పొదుపు ఖాతాలో డబ్బులను ఎల్లప్పుడూ డిపాజిట్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి కూడా ఓ పరిమితి ఉంది. పరిమితికి మించి పొదుపు ఖాతాలో ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసినట్లయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. పొదుపు ఖాతాకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ వారి నియమాలు ఇలా ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో డబ్బును డిపాజిట్ చేసే మొత్తం రూ.10 లక్షలకు మించకూడదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఈ పరిమితి దాటినట్లయితే అటువంటివారు ఆదాయపు పన్ను శాఖ వారికి సమాచారం అందించాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం ఒక ఖాతాదారుడు ఒక రోజులో రూ.2 లక్షలు లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్రమంలో లావాదేవీలు ఆ మొత్తాన్ని మించి ఉంటే కనుక అతను బ్యాంకుకు కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన పొదుపు ఖాతాలో రోజుకు రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే బ్యాంకుకు సమాచారం అందించాలి.

దీంతోపాటు ఆ ఖాతాదారుడు తన పాన్ వివరాలను కూడా బ్యాంకులో అందించాలి. ఒకవేళ అతనికి పాన్ కార్డ్ లేనట్లయితే ఫారం 60 లేదా 61ని బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న లావాదేవీలను బ్యాంకు అధిక విలువ లావాదేవీలుగా పరిగణలోకి తీసుకుంటుంది. ఆదాయపు పన్ను శాఖ వారికి అధిక విలువ లావాదేవీల గురించి బ్యాంకు సమాచారం అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో పలు కారణాల వలన బ్యాంకు ఖాతాలో పెద్ద లావాదేవీలను చేయాల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఆదాయపు పన్ను శాఖ వారికి తెలియజేయాలి.

ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వస్తుంది. అటువంటి నోటీసు కనుక ఆదాయపు పన్ను శాఖ నుంచి మీరు పొందినట్లయితే వెంటనే దానికి స్పందించి ఆ నోటీసుకు సమాధానం తో పాటు, దానికి సంబంధించిన పత్రాలను కూడా అందించాలి. ఇక ఈ పత్రాలలో పెట్టుబడి రికార్డులు స్టేట్మెంట్లు, ఆస్తుల వివరాలు మొదలైనవి ఉంటాయి. ఇలా పత్రాలకు సంబంధించి మీకు ఏమైనా సమస్య ఉంటే ఆర్థిక సలహాదారుని కూడా సంప్రదించవచ్చు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular