Petrol: పెట్రోల్, డీజిల్ లేకుండా ఏ వాహనం ముందుకు సాగదు. నిత్యం లక్షల కొద్దీ వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. వీటిలో పెట్రోల్ ఇంధనంతో నడిచేవే ఎక్కువగా ఉంటాయి. వాహనాల రాకపోకలపై పరిమితి లేనందున ప్రతి ఒక్కరూ ఎంత ఇంధనం కావాలంటే అంత ఇస్తారు. పెద్ద పెద్ద వాహనాల్లో అయితే ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఒకేసారి కొనుగోలు చేస్తారు. కానీ ఓ రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ కొనుగోలు చేయడానికి పరిమితులు ఉన్నాయి. పెట్రోల్ ను రూ.200 కొనుగోలు మాత్రమే పరిమితి విధించారు. ఎందుకంటే?
భారత్ లో ఈశాన్య రాష్ట్రాలది ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడి లాగా అక్కడి జనజీవనం సారవంతమైన నేలలో కాకుండా కొండ చరియల్లో ఉంటుంది. దీంతో ఈ కొండ చరియలు విరిగిపోవడం వల్ల నిత్యం రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఇదే కోవలో తాజాగా త్రిపుర రాష్ట్రంలోని లుమ్ డింగ్ డివిజన్ పరిధిలో జటింగా, లఫూర్ మధ్య ఏప్రిల్ 25న ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆహార వస్తువులు నిలిచిపోయాయి.
నిత్యావసర వస్తువులు సరఫరా నిలిచిపోవడంతో వస్తువుల రవాణాను పరిమితం చేశారు. ఈ క్రమంలో వాహనాల్లో పోసుకునే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై పరిమితి విధించారు. ఈ నియమాలు మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నియమాల ప్రకారం టూవీర్స్ కలిగిన వారు ప్రతి రోజు రూ.200 పెట్రోల్ ను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే డీజిల్ వాహనాలు 4 వీలర్ అయితే రూ.500, మిని బస్సులు 40 లీటర్ల ఇంధనం మాత్రమే కొనుగోలు చేయాలి.
ఇక ప్యాసింజర్ ఆటోలైతే కేవలం 15 లీటర్ల పెట్రోల్ కు మాత్రమే అవకాశం ఇస్తారు. ఇలా పెట్రోల్ కొనుగోలుపై పరిమితి విధించినందున వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వివిధ అవసరాల నిమిత్తం పెట్రోల్ అవసరం ఎక్కువగా ఉంటుందని, ఇలా నింధనలు విధించడం వల్ల అవసరాలు తీరడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచించాలని కోరుతున్నారు.