
ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య అంత్య క్రియలు నేడు జరుగనున్నాయి. అంత్యక్రియల కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు. నేటి అంత్యక్రియల కార్యక్రమం కోసం లోకేష్ రాత్రి ప్రొద్దుటూరులోనే బస చేశారు. రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరులో పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణి కార్యక్రమం వద్ద అందరు చూస్తుండగా దుండగులు సుబ్బయ్యను నరికి చంపారు. హతుడు సుబ్బయ్య, అధికారపాలర్టీ శ్రేణులు ఇటీవల అసాంఘిక కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా వరుసగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చే ఫ్లాట్లలోనే సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.