YSRCP Next Leader : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party )అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ నుంచి నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారు సైలెంట్ లో ఉన్నారు. మరికొందరు అయితే అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఇంకొందరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారన్న మాటే కానీ పెద్దగా యాక్టివ్ గా లేరు. సరిగ్గా ఏడాది క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఊహించని ఈ పరాజయాన్ని ఎదుర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక భవిష్యత్తు లేదని భావించి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి సైతం పార్టీతో పాటు రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. ఆయన స్థానం భర్తీ చేసేవారు కరువయ్యారు.
Also Read : ఎట్టకేలకు ధర్మాన స్ట్రాంగ్ డెసిషన్!
* వారి తీరుతోనే ఓటమి..
భారీ అంచనాలతో ఎన్నికల బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. అయితే పార్టీకి ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy), సీఎమ్ఓ ధనుంజయ రెడ్డి కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం విమర్శలు చేశారు. అంతర్గత సమావేశాల్లో సైతం చెప్పుకొచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలను పక్కకు తప్పించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పార్టీలో సభ్యుల రామకృష్ణారెడ్డి కొద్దిరోజులపాటు సైలెంట్ అయ్యారు. ఆయనకు పార్టీ అంతర్గత వ్యవహారాలకు పరిమితం చేయాలని జగన్మోహన్ రెడ్డికి సూచనలు కూడా వెళ్లాయి. అటు తరువాతే సజ్జల రామకృష్ణారెడ్డి సైలెంట్ పాటించారు.
* నేతల రాజీనామాతో కలవరం..
అయితే పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోవడంతో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటివరకు వారు పార్టీకి అండదండలు అందిస్తూ వచ్చారు. విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తరువాత పార్టీ వ్యవహారాలు మొత్తం చక్కబెట్టింది ఆయనే. అయితే ఉన్నట్టుండి ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన నిర్వర్తించిన బాధ్యతలు ఎవరికి అప్పగించాలా అని ఆలోచించారు జగన్. వై వి సుబ్బారెడ్డి కి విజయసాయిరెడ్డి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన సైతం నిర్వర్తించలేకపోయారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించారు కానీ ఆయన జూనియర్. అందుకే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయనకు వద్దని పార్టీ నేతలు వారించారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించాల్సి వచ్చింది.
* ‘వెన్నుపోటు దినం’ బాధ్యతలు ఆయనకే..
జూన్ 4 నాటికి కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆ రోజున వెన్నుపోటు దినంగా పాటించాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సజ్జల రామకృష్ణారెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంకోవైపు జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పరామర్శిస్తున్నది కూడా ఆయనే. దీంతో విజయసాయిరెడ్డి బాధ్యతలు దాదాపు సజ్జల రామకృష్ణారెడ్డికి బదలాయించినట్టే.