spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rayalaseema Lift Irrigation: వైసీపీ సౌండ్.. బిఆర్ఎస్ సైలెన్స్

Rayalaseema Lift Irrigation: వైసీపీ సౌండ్.. బిఆర్ఎస్ సైలెన్స్

Rayalaseema Lift Irrigation: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పై గట్టి పోరాటమే చేస్తోంది. చంద్రబాబుతో మాట్లాడి తాను రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపానని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. అయితే ఆ ప్రాజెక్టు పనులను తానే నిలిపివేసిన విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కనీసం అనుమతులు తీసుకోకుండా.. అసలు సరైన ప్రణాళిక లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దిగారు జగన్మోహన్ రెడ్డి. ఒక రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతగా ఆ ప్రాంతానికి న్యాయం చేశానని ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేలా చేశారు. కానీ అనుమతులు తీసుకోకపోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అదే సమయంలో తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఎలాగూ అనుమతులు లేవు కాబట్టి కేంద్రం ఆదేశాలతో పనులు నిలిపివేశారు జగన్మోహన్ రెడ్డి.

* అప్పుడే నిలిచిపోయిన ప్రాజెక్ట్.. రాయలసీమ( Rayalaseema ) ఎత్తిపోతల పథకం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిలిచిపోయింది. ఇప్పుడు రేవంత్ ప్రకటనతో దానికి జీవం పోస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాట బాట పట్టింది. ఇదే చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి మేలు చేయాలన్న లక్ష్యంతో నదీ జలాల మిగులతో రాయలసీమకు నీరు పంపించాలని ప్రణాళిక వేశారు. తెలంగాణ సమాజం నుంచి దానికి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అక్కడ అధికార కాంగ్రెస్ తో పాటు గులాబీ పార్టీ కూడా వ్యతిరేకించింది. కానీ ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు ప్రయత్నాన్ని సమర్థించలేదు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఆందోళనలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణలో కెసిఆర్ పార్టీ మాత్రం కనీసం దీనిపై స్పందించడం లేదు. అదే ఏపీలో ఇతర పార్టీలు చేసి ఉంటే ఈపాటికి గులాబీ పార్టీ సౌండ్ చేసేది.

* ఉమ్మడి శత్రువు ఉండడంతో.. తెలంగాణలో( Telangana) గులాబీ పార్టీ, ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్థితిలో ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు చంద్రబాబు. ఆపై కాంగ్రెస్ పార్టీ అన్న పడదు. బిజెపితో చేతులు కలుపుతాం అంటే కుదరదు. ఎల్లవేళలా బిజెపి నుంచి సహాయం దొరికే పరిస్థితి కూడా లేదు. అందుకే సమిష్టిగా ముందుకు వెళుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు విషయంలో రాజీ పడుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సజ్జల నేతృత్వంలో సభ పెడితే గులాబీ పార్టీ కనీసం కిక్కురు మనలేదు. అదే టిడిపి నేతలు ఎవరైనా అలాంటి విచ్చేసి ఉంటే మాత్రం కెసిఆర్ నేతృత్వంలోని గులాబీ పార్టీ నేతలంతా బయటకు వచ్చి విమర్శలు చేసేవారు. ఆ పార్టీ అధికార పత్రిక నమస్తే తెలంగాణ వ్యతిరేక వార్తలతో నింపేసేది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి.. చంద్రబాబు సర్కారు ఉంది కాబట్టి.. వైసీపీకి రాజకీయ ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైలెంట్ పాటిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper