spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi Mohan : పోలవరం గట్లను తోడేసిన వల్లభనేని వంశీ.. రూ.100 కోట్ల స్కామ్.....

Vallabhaneni Vamsi Mohan : పోలవరం గట్లను తోడేసిన వల్లభనేని వంశీ.. రూ.100 కోట్ల స్కామ్.. కూటమి సీరియస్ యాక్షన్!

Vallabhaneni Vamsi Mohan : వల్లభనేని వంశీ మోహన్ ఇటీవల కనిపించడం మానేశారు. ఆయనపై త్వరలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం నడిచింది.వాస్తవానికి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది.ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కలిసి బయటకు వెళ్లిపోయిన వంశీ..తన సొంత నియోజకవర్గంలో గన్నవరంలో అడుగుపెట్టలేకపోయారు. అప్పుడప్పుడు కోర్టు కేసులకు మారువేషంలో వస్తున్నారు. అయితే తొలుత ఆయన అమెరికా పారిపోయారని ప్రచారం నడిచింది. కానీ మధ్య మధ్యలో కనిపించారు.వైసిపి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కొడాలి నాని పక్కనే దీనంగా కూర్చున్నారు. పూర్తిగా రాజకీయాలను విడిచిపెట్టి అమెరికా వెళ్లిపోతారని కూడా తెగ ప్రచారం నడిచింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం విడిచి పెట్టే ఛాన్స్ లేదు.అందుకే తన అనుచరుల వద్ద తాను రాజకీయాలకు దూరము అవుతానని అర్థం వచ్చేలా మాట్లాడారు. కొందరు కుల పెద్దలు రంగంలోకి దిగి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గన్నవరంలో వంశి అనుచరులు పెద్ద ఎత్తున అరెస్టు అవుతున్నారు. తరువాత అరెస్టు వల్లభనేని వంశీ దేనని ప్రచారం నడుస్తోంది. అయితే అది మామూలు కేసు కాదట. దాదాపు 100 కోట్లు విలువ చేసి ఆర్థిక నేరానికి వంశీ పాల్పడినట్లు తెలుస్తోంది. దాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం.

* కాలువ గట్లు తవ్వేశారు
వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. అయితే ఆయనపై ఉన్న బినామీ ఇళ్ళ పట్టాల కేసు ఒకటి బయటకు తెచ్చింది వైసిపి. పార్టీలోకి వస్తేనే ఎటువంటి కేసు లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది.పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆ కేసును అడ్డం పెట్టుకొని చంద్రబాబు కుటుంబం పై విరుచుకుపడేలా చేసింది జగన్ సర్కార్.అయితే ఇంతవరకు జరిగింది ఇదేనని అంతా భావించారు. అయితే వంశీ హయాంలో పోలవరం కాలువ గట్లను కూడా తవ్వుకొని అమ్మేసుకున్నట్లు తాజాగా తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ప్రభుత్వం ప్రాథమిక విచారణలో తేలింది. ఇక కేసు పెట్టి అరెస్టు చేయడమే మిగిలింది.

* అంతా బినామీలతోనే
అయితే మొత్తం బినామీలతోనే ఈ తతంగం జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే డ్రైవర్లు, వైసీపీ నేతల దగ్గర పనిచేసిన వారిని బినామీలుగా పెట్టి లైసెన్సులు తీసుకున్నారు. తీసుకున్న లైసెన్సులు ఒకచోట అయితే మరోచోట తవ్వకాలు జరిపారు. ఇలాంటి లెక్కలను విజిలెన్స్ బయటకు తీసింది. దాదాపు 100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించింది.అయితే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన విజిలెన్స్ బినామీ దారులను అరెస్టు చేయడం ప్రారంభించింది. అయితే తాము అటువంటి లైసెన్సులు తీసుకోలేదని..ఆధార్ కార్డు జిరాక్స్లు వల్లభనేని వంశీ అడిగితే ఇచ్చామని వారు చెబుతున్నారు.తమ ఆధార్ కార్డులు పెట్టి వంశీ లైసెన్స్ తెచ్చుకుని చదువుకున్నారని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వల్లభనేని వంశీ పై రేపో మాపో పట్టిష్టమైన ఒక కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.అదే జరిగితే ఆయనపై క్రిమినల్ కేసుతో పాటు ఆర్థికపరమైన కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper