spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Minister Vishwaroop : వైసీపీ మంత్రికి పొగబెట్టారు.. అసలు కారణం ఇదే

Minister Vishwaroop : వైసీపీ మంత్రికి పొగబెట్టారు.. అసలు కారణం ఇదే

Minister Vishwaroop : మంత్రి పినిపె విశ్వరూప్ కు పొమ్మన లేక పొగపెడుతున్నారా? ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం అందులో భాగమేనా? అమలాపురం అల్లర్ల తరువాత ఎందుకు ప్రాధాన్యం తగ్గించారు? కనీసం ఆయన్న చూసేందుకు సైతం జగన్ ఇష్టపడడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల వైసీపీ లైన్ లోనే పవన్ పై విమర్శలు చేశారు. పవన్ సీఎం కావాలని తనకు ఆకాంక్ష ఉందని చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రంలో 175 సీట్లకు పోటీచేస్తే కదా అది సాధ్యమవుతుందని వ్యంగ్యంగా అన్నారు. కానీ మనసులో ఏదో పెట్టుకొని వైసీపీ అనుకూల మీడియా విశ్వరూప్ జనసేనలో చేరడం ఖాయమైందని ప్రచారం చేస్తోంది.

కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం గురించి తెలిసిందే. ఆ సమయంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆయన ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో తప్పిదాన్ని జనసేనపై వేసేందుకు కుట్ర చేశారు. కానీ ఓ కీలక నేత ఆదేశాలతోనే అంతటి విధ్వంసం జరిగిందని తరువాత ఆరోపణలు వెల్లువెత్తాయి. జనసేన అధ్యక్షుడు పవన్ సైతం స్పందించారు. ప్రభుత్వ పెద్దలపై కీలక ఆరోపణలు చేశారు. ఆ సమయంలో మంత్రి విశ్వరూప్ మంచివారేనని.. అధికార పార్టీలోనే ఆయనపై కుట్ర జరిగిందని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచే విశ్వరూప్ పై వైసీపీ హైకమాండ్ అనుమానపు చూపులు చూడడం ప్రారంభించింది.

అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మరోసారి పోటీకి సన్నద్ధమవుతున్నారు. కానీ టిక్కెట్ మొండిచేయి చూపించేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నిన్నటివరకూ కుమారుడ్ని బరిలో దించాలని చూసినా.. కుటుంబంలో మారిన పరిస్థితులతో మరోసారి తానే పోటీచేయాలని విశ్వరూప్ డిసైడయ్యారు. ఇంతలో పార్టీ స్వరం మారింది. అమలాపురం అల్లర్ల తరువాత విశ్వరూప్ గురించి పట్టించుకునే వారు లేరు. ఇటీవల అనారోగ్యానికి గురైన సందర్శించిన పాపాన పోలేదు. టిక్కెట్ ఎగ్గొట్టేందుకే పెద్దలు పొమ్మన లేక పొగ పెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

వారాహి యాత్రలో భాగంగా పవన్ వైసీపీ నేతలపై అటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర వైసీపీ నేతల మాదిరిగా విశ్వరూప్ కూడా స్పందించారు. పవన్ ఎలా సీఎం అయిపోతారని ప్రశ్నించడంలో భాగంగా వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు 175 సీట్లకు పోటీచేయకుండానే సీఎం అవ్వడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. తనకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉందని.. అందుకైనా అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలని విశ్వరూప్ సెటైర్ వేశారు. అయితే అప్పటికే విశ్వరూప్ ను బయటకు పంపించేయ్యాలన్న ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆయన జనసేనలో చేరడం ఖాయమని నిర్ధారిస్తూ వార్తలు రాయిస్తున్నారు. కేవలం వైసీపీ అనుకూల మీడియాలో ఇటువంటి కథనాలు వస్తుండడం విశేషం.

వైసీపీలో వెనుకబడిన ఆ 18 మంది బాధితుల్లో మంత్రి విశ్వరూప్ ఉన్నట్టు మీడియాకు లీకులిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డౌటే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా విశ్వరూప్ ను వదిలించుకోవడానికే ఇటువంటి చర్యలకు వ్యూహకర్తలు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనతో విశ్వరూప్ కుమారుడు చర్చలు పూర్తయ్యాయని కథనాలు వండి వార్చి ప్రచారం చేస్తున్నారు. వీటిని అర్ధం చేసుకోలేనంత అమాయకుడు మంత్రి విశ్వరూప్ కాదు. దీనిపై ఆయన ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper