spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాక్.. సత్తెనపల్లి తెరపైకి సీనియర్

Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాక్.. సత్తెనపల్లి తెరపైకి సీనియర్

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగలనుందా? జగన్ ఝలక్ ఇవ్వనున్నారా? సత్తెనపల్లి ఇన్చార్జిగా వేరొకరు రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చుతున్నారు జగన్. పార్టీకి గుడ్ బై చెబుతున్న వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. సైలెంట్ గా ఉన్న సీనియర్ నేతల స్థానంలో సైతం కొత్తవారిని తీసుకుంటున్నారు. అలాగే వివిధ సమీకరణల్లో భాగంగా ఇప్పుడున్న వారిని పక్కకు తప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో స్పీకర్ గా వ్యవహరించారు తమ్మినేని సీతారాం. ఈ ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అక్కడ తమ్మినేని తప్పించి చింతాడ రవికుమార్ అనే యువకుడికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అంబటి విషయంలో సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మూడోసారి పోటీ చేసిన అంబటి రాంబాబు దారుణంగా ఓడిపోయారు. అయినా సరే బాపట్ల జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు జగన్.కానీ ఇప్పుడు ఏకంగా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సమాచారం.

* రెండుసార్లు ఓటమి
2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తొలిసారిగా పోటీ చేశారు అంబటి రాంబాబు. కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. టిడిపి అధికారంలోకి రావడంతో కోడెల అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. 2019లో మాత్రం అదే కోడెలపై గెలిచారు అంబటి రాంబాబు. జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. గత ఐదేళ్లుగా దూకుడుగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. కన్నా లక్ష్మీనారాయణ టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మాజీ మంత్రి తో పాటు బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు. ఆయనపై కొత్త అభ్యర్థిని పెడితే కానీ వైసీపీ గట్టెక్కదని జగన్ భావిస్తున్నారు. అందుకే కొత్త నేత కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి తెరపైకి తెచ్చినట్లు సమాచారం.

* ఆ సమీకరణలతోనే
సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం అధికం. గతంలో ఇదే నియోజకవర్గానికి రెడ్డి సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తే కన్నా లక్ష్మీనారాయణను ఢీ కొట్టవొచ్చని జగన్ భావిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ చాన్స్ ఇవ్వలేదు. అయినా సరే పార్టీ విజయానికి కృషి చేశారు రామకృష్ణారెడ్డి. చురుకైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. పైగా అంబటి పై వైసీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. అందుకే సత్తెనపల్లి తెరపైకి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆళ్ల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper