spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Revanth Reddy: ఓటేపియ్యాలి మళ్లీ.. మళ్లీ.. మాట తుళ్లిన రేవంత్‌!

CM Revanth Reddy: ఓటేపియ్యాలి మళ్లీ.. మళ్లీ.. మాట తుళ్లిన రేవంత్‌!

CM Revanth Reddy: పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఎన్నికలు జరుగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈమేరకు రెండు రాష్ట్రాల పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాయి.

అసెంబ్లీ ఎన్నికల జోష్‌ కొనసాగించాలని..
ఇక తెలంగాణలో డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల జోష్‌ను పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీల్లో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు జిల్లాల వారీగా మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు.

మాట తుళ్లిన రేవంత్‌..
ఇక సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు మార్చి 28న కొడంగల్‌ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులతోసమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో వంశీచందర్‌రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని కోరారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లను రప్పించాలని నాయకులకు సూచించారు. అక్కడ ఓటు ఉన్నా.. ఇక్కడ కూడా ఓటు వేసేలా చూడాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు ఉన్నందున, ఇక్కడ ఓటేసి, తర్వాత అక్కడ ఓటేసేలా చూడాలని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సీఎం స్థాయిలో ఉండి..
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేసేలా చూడాలని మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొరపాటున అన్నారా.. తొందర పాటులో అన్నారా తెలియదు కానీ ఆయన వ్యాఖ్యలను మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ కూడా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper