Pawan Kalyan – Modi : ప్రపంచంలో భారత జాతీయ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు. అటు దేశవ్యాప్తంగా జాతీయవాదం బలంగా ఉన్న నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అందుకే పవన్ ప్రధాని మోడీకి వీరాభిమానిగా మారారు. గత ఎన్నికల్లో బిజెపి గెలిచిన తరువాత.. పవన్ ఎన్డీఏలో చేరడానికి ప్రధాని మోదీయే కారణం. 2014లో రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. నాడు విపక్ష నేతగా ఉన్న సమయంలో మోడీ ఏపీకి వచ్చారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని పవన్ కలుసుకున్నారు. అయితే నాడు ఏపీలో టిడిపి.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది.
ఆ ఐదు సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ఎన్నడు ప్రధానిని కలిసేందుకు ఇష్టపడలేదు. కేంద్రం నుంచి పదవులు తీసుకునే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. అందుకే పవన్ అంటే మోదీ చాలా అభిమానం పెంచుకున్నారు. గత ఎన్నికల్లో విభజన హామీల అమలు నేపథ్యంలో బిజెపిని పవన్ విభేదించారు. కానీ ఎన్నడూ ప్రధాని మోదీని విమర్శించలేదు. 2019 ఎన్నికల తరువాత ఎన్డీఏలో పవన్ చేరినా.. ప్రధాని మోదీని కలిసింది ఒకటి రెండు సార్లు మాత్రమే. అందుకే పవన్ ఆత్మాభిమానాన్ని అభిమానించే మోదీ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
గత నెలలో చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో సైతం పవన్తో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈరోజు రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభకు ప్రధాని మోదీ వచ్చారు. ఆయనతోపాటు పవన్ వేదిక పంచుకున్నారు. ప్రత్యేకంగా శాలువ కప్పి సన్మానించారు. పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని మోదీ వద్దంటూ సముదాయించారు. పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రధాని మోదీ. ఈ తరహా అభిమానాన్ని చూసి ఫిదా అయిపోయారు పవన్.