spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Delhi Tour :  లోకేష్ ఢిల్లీ పొలిటికల్ టూర్.. వైసీపీలో టెన్షన్ టెన్షన్!

Nara Lokesh Delhi Tour :  లోకేష్ ఢిల్లీ పొలిటికల్ టూర్.. వైసీపీలో టెన్షన్ టెన్షన్!

Nara Lokesh Delhi Tour : లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఆయన అధికారికంగా పర్యటించడం లేదు. షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. ఇది పూర్తిగా రాజకీయ పర్యటన అని తెలుస్తోంది. ఢిల్లీలో కీలక నేతలను వరుసగా కలుస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు ఎజెండాలతో లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో సైతం టిడిపి తో కలిసి బీజేపీ అధికారం పంచుకుంటుంది. అందుకే నామినేటెడ్ పదవుల విషయంలో కేంద్ర పెద్దల అనుమతి తీసుకోవడానికి లోకేష్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల నియామకం విషయంలో లోకేష్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.ఒక క్రమ పద్ధతిలో నియామకం జరగాలని లోకేష్ భావిస్తున్నారు.అందుకే కేంద్ర పెద్దలను సంప్రదించినట్లు తెలుస్తోంది.

* వైసీపీని ఇరుకున పెట్టేందుకు
మరోవైపు రాష్ట్రంలో వైసీపీని ఇరుకున పెట్టే చర్యలు ముమ్మరం అవుతున్నాయి. ప్రధానంగా ముంబై నటి కదంబరి జెత్వాని కేసు విషయంలో ఐపీఎస్ లపై పట్టు బిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసిపి కీలక నేత ప్రమేయం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒక వైసీపీ నేత అరెస్టు కూడా జరిగింది. మిగిలిన వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కేసు విషయంపై సైతం లోకేష్ కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

* కేంద్రం సీరియస్
తాజాగా తిరుపతి లడ్డు వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. జాతీయస్థాయిలో సంచలనంగా మారింది. అటు ఆర్ఎస్ఎస్ తోపాటు విశ్వహిందూ పరిషత్ సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రంలో టిడిపి భాగస్వామి కావడం.. హిందూ సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావిస్తుండడంతో.. కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ కేంద్ర పెద్దలతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు విషయంలో మరింత పట్టు బిగించాలన్నది లోకేష్ వ్యూహంగా తెలుస్తోంది.

*ప్రకంపనలు
లోకేష్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. లడ్డు వివాదం ఎటువైపు దారితీస్తుందో నన్న ఆందోళన కనిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం అరెస్టులకు దిగితే పరిస్థితి ఏంటిఅన్న డిఫెన్స్ వైసీపీలో వ్యక్తమౌతోంది. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ ఢిల్లీలో కీ రోల్ ప్లే చేశారు.మరోసారి లోకేష్ ఢిల్లీలోనే పాగా వేయడం,కేంద్ర ప్రజలకు చర్చలు జరపడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper