Homeఆంధ్రప్రదేశ్‌Kinjarapu Ram Mohan Naidu: కింజరాపు రామ్మోహన్ నాయుడు మార్పు తప్పదా?

Kinjarapu Ram Mohan Naidu: కింజరాపు రామ్మోహన్ నాయుడు మార్పు తప్పదా?

Kinjarapu Ram Mohan Naidu: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న బలమైన చర్చ నడుస్తోంది. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. కొత్త టీం రావడంతో పాటు కొందరి మంత్రుల ఉద్వాసన ఉండబోతుందన్న టాక్ కూడా ఉంది. కొందరి మంత్రి పదవులు చేర్పులు మార్పులు ఖాయమన్న చర్చ నడుస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు ఉంటుందన్న […]

Kinjarapu Ram Mohan Naidu: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న బలమైన చర్చ నడుస్తోంది. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. కొత్త టీం రావడంతో పాటు కొందరి మంత్రుల ఉద్వాసన ఉండబోతుందన్న టాక్ కూడా ఉంది. కొందరి మంత్రి పదవులు చేర్పులు మార్పులు ఖాయమన్న చర్చ నడుస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు ఉంటుందన్న టాక్ నడుస్తోంది. పౌర విమానయాన శాఖ నుంచి ఆయనకు వేరే శాఖకు బదిలీ చేస్తారని కూడా తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ పరిధిలో ఇటీవల జరిగిన పరిణామాలతో రామ్మోహన్ నాయుడు మార్పు అనివార్యం అని సమాచారం. అయితే రామ్మోహన్ నాయుడుకు ఏ శాఖ ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

* కీలకమైన పోర్టు పోలియో..
శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విజయం సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడును కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో రామ్మోహన్ నాయుడుకు కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కింది. అయితే పౌర విమానయాన శాఖ అనేది ఇప్పటికే ప్రైవేటీకరణ ఎక్కువగా జరిగింది. దీంతో ఆ శాఖ పరిధిలో చేసే అవకాశం ఏదీ లేదు. 2014లో కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం పార్టీగా టిడిపి ఉండేది. ఆ సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు వ్యవహరించేవారు. 2018లో టిడిపి ఎన్ డి ఏ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పదవిని వదులుకున్నారు అశోక్ గజపతిరాజు. దానిని కొనసాగింపుగా రామ్మోహన్ నాయుడుకు ఆ పదవి దక్కింది. అయితే పౌర విమానయాన శాఖలో నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. దీంతో అది రామ్మోహన్ నాయుడుకు మైనస్ గా మారింది. అందుకే ఆయన శాఖ మార్పు ఉంటుందన్న టాక్ మొదలైంది.

* తండ్రి నిర్వర్తించిన శాఖ.
రామ్మోహన్ నాయుడుకు కొత్తగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పదవిని ఆయన తండ్రి కింజరాపు ఎర్రం నాయుడు నిర్వర్తించారు. 1996 సమయంలో జాతీయస్థాయిలో కూటమి ప్రభుత్వాలు నడుస్తుండేవి. ఆ సమయంలో టిడిపి కీలకంగా ఉండేది. అందుకే ఎర్రం నాయుడుకు గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు పంచాయతీరాజ్ శాఖ దక్కింది. ఒక విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రం నాయుడు ప్రాబల్యం ఆశాఖ ద్వారానే పెరిగింది. ఇప్పుడు మరోసారి రామ్మోహన్ నాయుడుకు అదే శాఖ కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper