Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan And DK Shivakumar: కాంగ్రెస్ గూటికి జగన్.. డీకే శివకుమార్ కు అదే...

YS Jagan And DK Shivakumar: కాంగ్రెస్ గూటికి జగన్.. డీకే శివకుమార్ కు అదే టాస్క్

YS Jagan And DK Shivakumar: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు బాధ్యతలు తీసుకొనున్నారు. ఇటీవల సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వ్యూహాత్మకంగా డీకే శివకుమార్ కు కర్ణాటక బాధ్యతలు అప్పగించింది. అయితే కేవలం కర్ణాటకలో రాజకీయ ప్రయోజనాలు పొందడం కాదు.. దక్షిణ భారతదేశంలో బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దేందుకు డీకే శివకుమార్ ద్వారా అగ్ర నాయకత్వం బలమైన స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే […]

YS Jagan And DK Shivakumar: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు బాధ్యతలు తీసుకొనున్నారు. ఇటీవల సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వ్యూహాత్మకంగా డీకే శివకుమార్ కు కర్ణాటక బాధ్యతలు అప్పగించింది. అయితే కేవలం కర్ణాటకలో రాజకీయ ప్రయోజనాలు పొందడం కాదు.. దక్షిణ భారతదేశంలో బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దేందుకు డీకే శివకుమార్ ద్వారా అగ్ర నాయకత్వం బలమైన స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ సహకారంతో విజయ్ ప్రభుత్వం నడుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలను మరింత బలమైన క్యారీడార్ గా రూపొందించుకొని.. 2029 ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకోవాలన్నది కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్లాన్. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత లోటు అనేది ఏపీ నుంచి ఉంది. దానిని భర్తీ చేసే బాధ్యతను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. డీకే శివకుమార్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.

* ఓటు బ్యాంకు టార్గెట్..
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంత జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది. షర్మిల ద్వారా దాని టర్న్ చేసే ప్రయత్నం జరిగిన వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడున్న ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేయడం.. లేకుంటే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం.. అది కాదంటే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవడం. అయితే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ అంటేనే అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునే పరిస్థితి లేదు. అది డీకే శివకుమార్ ద్వారా చేయాలన్నది రాహుల్ గాంధీ ప్లాన్. రాజశేఖర్ రెడ్డి ఉన్న నాటి నుంచి కుటుంబ, వ్యాపార సన్నిహితుడు డికె శివకుమార్. ఆ కుటుంబం బలం, బలహీనతలు తెలుసు. పైగా ఆస్తి పంచాయితీలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఆపై జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో కలపగల శక్తి కలిగి ఉన్నారు. అందుకే అగ్రనేత రాహుల్ కీలక టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

* దక్షిణాది రాష్ట్రాలు కీలకం..
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావాలి అంటే దక్షిణాది రాష్ట్రాలు కీలకం. ఐదు రాష్ట్రాలు ఉంటే అందులో మూడింట నేరుగా అధికారంలో ఉంది. మరో రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉంది. ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఉంది. ఆ కూటమిని ఢీ కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డికి మిగతా రాజకీయ పక్షాలు సాయం అవసరం. అందుకే ఆయనను కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు శివకుమార్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 135 పార్లమెంట్ స్థానాలు ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు వస్తే ఈజీగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన బిజెపి నుంచి బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఇదే ఊపుతో డీకే శివకుమార్ పట్టు బిగిస్తే.. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper