Homeఆంధ్రప్రదేశ్‌AP Weather Update: ఏపీలోని ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

AP Weather Update: ఏపీలోని ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

AP Weather Update: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో చల్లటి గాలులు వియడం ప్రారంభించాయి. గత వారంతో పోల్చితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. వడగాలుల తీవ్రత తగ్గింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వర్షాకాలం ప్రవేశించినట్టు అర్థం అవుతోంది. అయితే […]

AP Weather Update: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఇంకా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో చల్లటి గాలులు వియడం ప్రారంభించాయి. గత వారంతో పోల్చితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. వడగాలుల తీవ్రత తగ్గింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వర్షాకాలం ప్రవేశించినట్టు అర్థం అవుతోంది. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. వర్షాలు అనుకున్న స్థాయిలో పడడం లేదు. కానీ ఇప్పుడు ఓపరితల ఆవర్తనం ప్రభావంతో చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* సంక్రాంతి తర్వాత నుంచి..
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. మార్చి రెండో వారం నుంచి విపరీతమైన ప్రభావం చూపడం ప్రారంభించాయి. ఏప్రిల్ లో ఎండలు మండిపోయాయి. మేనాటికి విశ్వరూపం చూపాడు భానుడు. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు దాటాయి. రాయలసీమ అయితే మండిపోయింది. కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఎండల ప్రభావం అధికంగా ఉంది ఈ ఏడాది. ఓ వారం రోజులపాటు 45 డిగ్రీలకు పైగా అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ గత రెండు రోజులుగా చల్లటి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చిరుజల్లుల గురించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెబుతోంది.

* ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని అంచనాలు వెల్లడించింది వాతావరణ శాఖ. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని చెబుతోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వర్షం పడిన సమయంలో చెట్లు, టవర్లు, స్తంభాల వద్ద నిల్చో వద్దని సూచిస్తోంది. పశువుల పెంపకం దారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper