AP Assembly Meetings
AP Assembly Meetings: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ( AP assembly sessions ) ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అటు తర్వాత సమావేశాలు కొనసాగుతాయి. దాదాపు మూడు వారాల పాటు సమావేశాలు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బిఎసి సమావేశం నిర్వహిస్తారు. అందులో అసెంబ్లీ అజెండా, బిల్లులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటివరకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో సమావేశాలకు గైర్హాజరవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు హోదా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న నిర్ణయం వెనుక కీలక పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అటు తరువాత అసెంబ్లీకి ముఖం చాటేశారు. ఎట్టకేలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.
* మారిన పరిస్థితులతో
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం వేల వైసిపి తమకు ప్రతిపక్ష హోదా కోసం నిరసనకు దిగే అవకాశం ఉంది. అదే సమయంలో రేపటి నుంచి జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రం హాజరవుతారని తెలుస్తోంది. జగన్ ఈరోజు సమావేశాలకు హాజరైన అనంతరం.. నేరుగా పులివెందుల బయలుదేరి వెళ్తారు. రెండు రోజులపాటు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే అవసరాన్ని బట్టి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు శాసనమండలి సభ్యులు సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది.
* ఆ విమర్శ రాకుండా ఉండేందుకు..
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు( assembly sessions ) హాజరు కాకపోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. దీంతో జగన్ మనసు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈరోజు సమావేశాలకు హాజరై… ప్రతిపక్ష నేత హోదా విషయంలో నిలదీస్తారని తెలుస్తోంది. అయితే జగన్ ఎన్ని రోజులు సభకు హాజరవుతారు అనేది ఇప్పటికీ పార్టీలోనే స్పష్టత లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై పోరుబాట ప్రకటించింది. ఇటీవల గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ రైతులను పరామర్శించారు. అంతకుముందు జైలులో ఉన్న వల్లభనేని వంశీని కలిశారు. ఉగాది నుంచి ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. జిల్లాల పర్యటన చేయాలని చూస్తున్నారు. అంతకుముందే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరన్న విమర్శను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* మైక్ ఇవ్వకుండా
అయితే ఈరోజు సభకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. ఆయన ప్రతిపక్ష నేత( opposition leader) కారు. అందుకే సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరు. ఒకవేళ మైక్ ఇచ్చినా.. కొద్ది సమయం కేటాయిస్తారు. తరువాత మై కట్ చేస్తారు. దానిని సాకుగా చూపి జగన్మోహన్ రెడ్డి సమావేశాల నుంచి బయటకు వెళ్తారని ప్రచారం నడుస్తోంది. కేవలం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదన్న విమర్శను తిప్పికొట్టేందుకే జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap assembly meetings jagans strategy is the same
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com