Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చంద్రబాబు మారారు

Chandrababu: చంద్రబాబు మారారు

Chandrababu: ఓటమి నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరికైనా తప్పదు. గత ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. జగన్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు శాపంగా మారాయి. అన్ని వర్గాల ప్రజలు పాలనతో విసిగి తీర్పు ఇచ్చారు. ఏకపక్ష తీర్పు అన్నట్టు ఉంది ప్రజాభిప్రాయం. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం వైసిపికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే గత ఎన్నికల్లో ఈ తరహా ఓటమిని చూసిన చంద్రబాబు. జగన్ పాలనలో వైఫల్యాలవిషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా పాలన సాగించడం, రెండు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం.. ఈ రెండింటి పైనే అటు అధికారులకు, ఇటు సొంత పార్టీ వారికి ప్రత్యేక పిలుపు ఇచ్చారు చంద్రబాబు.

గత ఐదు సంవత్సరాలుగా జగన్ సొంత పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయారు. ముఖ్యమంత్రిని కలవాలంటే పెద్ద ప్రయాసే నడిచేది. ఈ విషయాన్ని సాక్షాత్ డిప్యూటీ సీఎం రాజన్న దొర చెప్పుకొచ్చారు.తాను లోక్సభకు పోటీ చేస్తానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సీఎం అప్పాయింట్మెంట్ కోరితే.. కనీసం లభించలేదని ఆయన చెప్పుకోవడం విశేషం. అయితే చాలామంది వైసిపి నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య కూడా చంద్రబాబు ఇదే మాదిరిగా వ్యవహరించారు అన్న విమర్శ ఉంది. అందుకే ఈసారి చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యేల నుంచి ఎంపీ వరకు తనను నేరుగా కలవవచ్చని చెప్పుకొచ్చారు. ఈసారి మన మధ్య ఇటువంటి అడ్డు గీతాలు ఉండవని కూడా తేల్చేశారు.

మరోవైపు తన పర్యటన సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని లో ఉన్నప్పుడు కానీ… జిల్లాల పర్యటన సమయంలో కానీ.. ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని.. ఎటువంటి ఇబ్బందులు కలిగించ వద్దని కూడా అధికారులకు ఆదేశించారు. గత ఐదేళ్లలో జగన్ తన పర్యటనలో ప్రజలకు ఇబ్బంది పెట్టారన్న విమర్శ ఉంది. తొలి మూడు సంవత్సరాలు ఆకాశమార్గంలో జగన్ పర్యటించినా.. కింద రోడ్డు మార్గాల్లో కూడా ఆంక్షలు విధించే వారన్న ఆరోపణ ఉండేది. జిల్లాల పర్యటన సమయంలో రోజుల తరబడి ఆంక్షలు కొనసాగేవి. రహదారులు తవ్వేసేవారు. చెట్లు తొలగించేవారు. పచ్చదనం మాయం చేసేవారు. ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించినట్టు ఉన్నారు. అందుకే తన పర్యటనల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు వద్దని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ రెండు అంశాల్లోనే కాదు.. చాలా విషయాల్లో తాను మారానని చంద్రబాబు చెబుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper