AgriGold Case: అగ్రిగోల్డ్ బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. 2019 ఎన్నికల్లో అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది బాధిత కుటుంబాలు, వారి బంధువులు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. కానీ ఐదేళ్ల వైసిపి పాలనలో ఎటువంటి న్యాయం జరగలేదు అగ్రిగోల్డ్ బాధితులకు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్నారు. అయితే వారికి న్యాయం చేయకపోగా గత ఐదేళ్లలో వైసిపి నేతలు చేసిన పనులు అందరికీ తెలిసినవే. అయితే అగ్రిగోల్డ్ భూములను కొల్లగొట్టేందుకు వైసిపి నేతలు ప్రయత్నించారన్న ఆధారాలు ఇప్పుడు లభిస్తుండటం సంచలనంగా మారింది.
* అమలు కాని హామీ…
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఐదేళ్ల తన పాలనలో డిపాజిటర్లకు రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. అందుకే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. సీఎం చంద్రబాబు అగ్రిగోల్డ్ వ్యవహారం పై ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. దీంతో వైసిపి హయాంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయి.
* పత్రాలతో పాటు రికార్డులు మాయం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భూ రికార్డులను ఒక పద్ధతి ప్రకారం న్యాయం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఏపీ సిఐడి వద్ద భద్రంగా ఉండాల్సిన డిజిటల్ ఆధారాలు, హార్ట్ డిస్క్లు సైతం మాయం అయినట్లు తెలుస్తోంది. దీని వెనుక అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఈ మంత్రి వర్గ ఉప సంఘం లో సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. డిపాజిటర్లకు చందాల్సిన వేల కోట్ల విలువైన ఆస్తుల లోకేషన్లు, వేలం వివరాలు కోర్టులకు అందకుండా చేసేందుకే నాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ రికార్డుల విధ్వంసం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
* కదలనున్న డొంక..
ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన జోగి రమేష్ పైనే ఆరోపణలు వస్తున్నాయి. సిఐడి, ఈడి అటాచ్మెంట్ లో ఉన్న విజయవాడ రూరల్ అంబాపురంలోని అగ్రిగోల్డ్ స్థలాలను ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ సర్వే నంబర్లకు తన కుమారుడు, సోదరుడి పేరిట మార్పించి, ప్లాట్లుగా చేసి విక్రయించడం ద్వారా జోగి రమేష్ కుటుంబం కోట్ల రూపాయలు వెనుకేసుకున్నట్లు ఏసీబీ, సిఐడి విచారణలో ఆధారాలతో సహా దొరికిపోయింది. ఈ ల్యాండ్ స్కామ్ లో ఇప్పటికే జోగి రమేష్ కుమార్ ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న వైసీపీ నేతల హస్తం బయటపడే వీలుగా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది.
వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకు ఆరు నెలల గడువు విధించింది. ఈలోగా పక్కాగా న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. సిఐడి జప్తు చేసిన అన్ని స్థిరాస్తులను కోర్టుల ద్వారా వేగంగా వేలం వేసి.. ఆ సొమ్మును నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా లీగల్, సిఐడి విభాగాలను ప్రభుత్వం సమన్వయం చేస్తోంది. అగ్రిగోల్డ్ ఏజెంట్లనుంచి నెల రోజుల్లో బాండ్లు సేకరించాలని.. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల కమిటీ ప్రగతిని సమీక్షిస్తుందని కూడా తెలుస్తోంది. మొత్తానికి అయితే అగ్రిగోల్డ్ వ్యవహారంలో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.
