Homeఅంతర్జాతీయంPM Modi Bhutan Visit: బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగినా భూటాన్‌ పర్యటన ఆగలేదు.. మోధీ...

PM Modi Bhutan Visit: బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగినా భూటాన్‌ పర్యటన ఆగలేదు.. మోధీ మొండి ధైర్యం ఏమిటి?

PM Modi Bhutan Visit: దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్‌ 10న బాంబు బ్లాస్ట్‌ జరిగింది. ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘనతో యావత్‌ దేశం ఉలిక్కిపడింది. భద్రతపై సందేహాలను, ఆందోళనలను రెచ్చగొట్టి ప్రజల్లో భయభ్రాంతి నెలకొన్నది. బాధితులను పరామర్శించిన ఢిల్లీ సీఎం తక్షణం స్పందించగా, డీజీపీ, హోం మంత్రి సహా వివిధ అధికారులు సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సమయంలో మోదీ […]

PM Modi Bhutan Visit: దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్‌ 10న బాంబు బ్లాస్ట్‌ జరిగింది. ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘనతో యావత్‌ దేశం ఉలిక్కిపడింది. భద్రతపై సందేహాలను, ఆందోళనలను రెచ్చగొట్టి ప్రజల్లో భయభ్రాంతి నెలకొన్నది. బాధితులను పరామర్శించిన ఢిల్లీ సీఎం తక్షణం స్పందించగా, డీజీపీ, హోం మంత్రి సహా వివిధ అధికారులు సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సమయంలో మోదీ భూటాన్‌ పర్యటనకు వెళ్లారు. దీంతో ఈ సమయంలో ప్రధాని విదేశీ పర్యటన అవసరమా? అంటూ విపక్షాలు ప్రశ్నించాయి. అదే సమయంలో ‘దేశ ప్రతిష్ఠ నిలబెట్టేందుకు, భద్రతా వ్యవస్థల నమ్మకంతోనే ప్రధాని ముందుకు పోయారు‘ అని ఇంకొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీల విమర్శలు..
ఢిల్లీ పేలుడు తర్వాత మోదీ దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, విదేశీ మైత్రిని ముందు పెట్టడం ఏమిటి? అని విపక్ష నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, అధికార పార్టీ మాత్రం వ్యూహాత్మక అవసరాలు, భారత్‌–భూటాన్‌ ద్వైపాక్షిక సహకారం పెంపు దృష్టితోనే ట్రిప్‌ కొనసాగించారని సమర్ధించాయి. ‘రాజకీయ ప్రతిష్ఠ, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ కు డామేజ్‌ కాకుండా వూహించిన నిర్ణయం‘ అని ఇంకొంతమంది విశ్లేషించుకున్నారు. అయితే ఎక్స్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక వేదికలపై ‘దేశ ప్రధాని బాధితులను పరామర్శించాల్సింది, రాజకీయ ప్రయోజనం కోసం విదేశీ పర్యటన కొనసాగించారా?‘ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దాన్ని వ్యతిరేకంగా ‘భద్రతా యంత్రాంగంపై నమ్మకం చూపిస్తూ, అంతర్జాతీయ దౌత్యాన్ని దెబ్బతీయకుండా ముందుకు వెళ్లడం సాహసోపేత నిర్ణయం‘ అని చాలా మంది మద్దతూ వ్యక్తమైంది. ఈ రెండు అభిప్రాయాలు సమాను బలంగా ఉన్నాయని రాజకీయ వ్యాఖ్యాతలు విశ్లేషించారు.

అభివృద్ధి ఒప్పందాలు..
భూటాన్‌ పర్యటన లో మోదీ విద్యుత్‌ ప్రాజెక్టు ప్రారంభం, అభివృద్ధి ఒప్పందాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇరుదేశాల మైత్రిని చెరగనిగా మార్చే స్ట్రాటజిక్గా భాగ్యగా నిలిచాయి. తామే దేశానికి ధైర్యం, ప్రజల భద్రతపై నమ్మకం కల్పించాలనే ఇమేజ్‌ ప్రధాని ముందుకు వచ్చిన ఫాక్టర్లూ. భద్రతా ఘటనల అనంతరం ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా విమర్శలు ఎదురైనా… భారత ప్రధాని ఇటువంటి వ్యూహాత్మక నిర్ణయంలో, దేశ మైత్రి, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇది నాయకత్వ ధైర్యానికి, ‘దేశం భద్రమే‘ అనే నమ్మకానికి, భారత్‌–భూటాన్‌ భాగస్వామ్య బలోపేతానికి సూచికగా నిలిచిన నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper