India Pakistan Water Dispute: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ 1969 నాటి సిందు జలాల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టింది. నీటిని అవసరం లేనప్పుడు వదులుతూ.. అవసరం ఉన్నప్పుడు ఆపుతూ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు వెళ్లే నీటిని తాజాగా దారి మళ్లించింది. దీంతో పంజాబ్, జమ్మూ కశ్మీర్ రైతులకు వరం కలిగించింది.
పాకిస్తాన్ ఓవరాక్షన్కు ఫలితం
పహల్గాం ఉగ్రదాడితోపాటు తరచూ భారత్ను కవిస్తున్న పాకిస్తాన్ ఓవరాక్షన్కు ఫలితమిది. 2024 వరకు రావి నది నీరు పాకిస్తాన్కు మాత్రమే అందుతుందని భావించారు, ఈ క్రమంలో షాపూర్–ఖండి ప్రాజెక్టు నిర్మించి ఆ నీటిని దారి మళ్లించింది. ఇది పాకిస్తాన్ అంచనా తప్పు అని నిరూపించింది. భారత్ చాలాకాలంగా నిర్మిస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు 2024లో పూర్తి చేసి నీటిని ఉపయోగిస్తోంది. ఇది భారత్ దృఢ∙సంకల్పానికి నిదర్శనం.
నీటి యుద్ధంలో భారత్ విజయం
బ్యారేజీ నిర్మించకుండా ముందు రావి నది నీరు అత్యంత పాకిస్తాన్లోకి వెళ్లేది. ఇప్పుడు ఆ నీటిని జమ్మూ కశ్మీర్లోని కతువా జిల్లాలోని బ్యారేజీని నింపుతున్నారు. ఇది నీటి యుద్ధంలో భారత్ విజయం. నీరు అంటే ప్రాణం – రైతులకు, భారత్కు. పాకిస్తాన్కు వెళ్లే నీటిని దారిమళ్లించి భారత్ రైతులకు ప్రాణం పోసింది.
వేల ఎకరాలకు జీవం..
షాపూర్–ఖండి బ్యారేజీ నిర్మాణంతో వేల ఎకరాలకు ఏడాదంతా నీరు అందుతోంది. కథువా, సాంబా జిల్లాల్లో వ్యవసాయం మెరుగుపడింది. వర్షాధారంగా కాకుండా స్థిరంగా వ్యవసాయం చేసే అవకాశం కలిగింది. రైతుల జీవితాలలో మార్పు వచ్చింది. వర్షాధార వ్యవసాయం నుంచి స్థిర వ్యవసాయానికి మారింది. ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి దారి తీసింది.
పంజాబ్, జమ్మూ కశ్మీర్ రైతులకు లాభం
బ్యారేజీ నిర్మాణంతో పంజాబ్, జమ్మూ కశ్మీర్ రైతులకు ఆశ్చర్యకర లాభం. వారికి ఏడాదంతా నీరు అందుతోంది. వ్యవసాయం మెరుగుపడుతోంది. భారత్ సర్కార్ రైతులను మర్చిపోలేదు. నీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వరం కలిగిస్తోంది. బ్యారేజీ నిర్మాణానికి చాలాకాలం పట్టినా తాజాగా ఫలితం లభించింది. రైతులకు వరం కలిగింది.
పాకిస్తాన్పై భారత్ ఆధిపత్యం
ఇది కేవలం నీటి పంపుణీ మాత్రమే కాదు నీతి విజయం. పాకిస్తాన్ పై భారత్ ఆధిపత్యం. రావి నది నీరు పాకిస్తాన్కు మాత్రమే అందుతుందని భావించార, కానీ భారత్ దారిమళ్లించింది.
షాపూర్ ఖండి ప్రాజెక్టు భారత్ విజయం, రైతుల లాభం. పాకిస్తాన్ నీటిని దారిమళ్లించి భారత్ రైతులకు వరం కలిగించింది. ఇది భారత్ రచనాత్మక యోచన, నిర్మాణ సామర్థ్యం, రైతు పక్షపాతానికి నిదర్శనం.