Janasena – YCP : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది కాబట్టి.. పాత వీడియోలను తెరపైకి తెస్తున్నారు. అందులో తమకు అనుకూలంగా ఉన్న వాటిని తెగ ప్రచారం చేస్తున్నారు. ఎలాగూ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూపులను నిర్వహిస్తున్నాయి కాబట్టి, ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఒక భాగం కాబట్టి.. దర్జాగా సర్కులేట్ చేస్తున్నాయి. అలా వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గతంలో మదనపల్లి లో కార్యకర్తలతో భారీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అవలంబిస్తున్న విధానాలను ప్రజలతోనే చెప్పించాలనే ఉద్దేశంతో కొంతమంది మహిళలను వేదికపైకి ఆహ్వానించారు. ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల ద్వారానే ఏకరవు పెట్టించే ప్రయత్నం చేశారు. ఇది మంచి ఉద్దేశమే అయినప్పటికీ.. జనసేన ప్రయత్నానికి ఆదిలోనే దెబ్బ పడింది.
ఓ మహిళ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను చెప్పేందుకు వేదిక మీదికి వచ్చింది. ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్, ఇతర కీలక నాయకులు ఉన్నారనే భయమో, ఇంకోటో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ కు నమస్కారం అనబోయి.. జగన్ అన్నకు నమస్కారం అని చెప్పేసింది. దీంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం అలముకుంది. జనసేన సమావేశంలో జగన్ ప్రస్తావన రావడంతో వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియోను వైసిపి అనుకూల నెటిజన్లు తెగ ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ అనుబంధ గ్రూపుల్లో సర్కులేట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గత వీడియోలను వెలికి తీసి మరీ వివిధ పార్టీల అభిమానులు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుండడం విశేషం.. ఈ వీడియోలు ప్రజలనుంచి ఓట్లను రాల్చుతాయనే నమ్మకం కావొచ్చు.