Director Gunasekhar- Mahesh Babu: టాలీవుడ్ లో విలక్షణ నటుల జాబితా తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందు వరుస లో ఉంటుంది. బాలనటుడిగా ఉన్నప్పుడే చిచ్చరపిడుగులాగా దూసుకొచ్చిన మన సూపర్ స్టార్, హీరో గా తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కడు చిత్రం తో స్టార్ హీరో గా మారి, పోకిరి సినిమాతో సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.
ఇంత సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏనాడు ప్రయోగాలు చెయ్యకుండా ఉండలేదు. నటన పరంగా మహేష్ బాబు ఒక నిఘంటువు లాంటి వాడని ఆయనతో పని చేసిన ప్రతీ ఒక్కరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్ గా మహేష్ బాబు తో ‘ఒక్కడు’ లాంటి ల్యాండ్ మార్క్ సినిమా తీసిన డైరెక్టర్ గుణ శేఖర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘శాకుంతలం’ ఈ నెల 14 వ తేదీన విడుదలకు సిద్ధం గా ఉన్నది.ఈ సందర్భంగా ఆయన మూవీ ప్రొమోషన్స్ కోసం క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి..ఒక్కసారి అతనితో సినిమా చేసామంటే చాలు, అతనికి అడిక్ట్ అయ్యిపోతాము,మళ్ళీ మళ్ళీ అతనితోనే సినిమా చెయ్యాలని అనిపిస్తాది. అలా ఇప్పటి వరకు నేను ఆయనతో ఒక్కడు,అర్జున్ మరియు సైనికుడు వంటి సినిమాలు తీసాను. ఇలా ఈ తరం హీరోలలో ఒక డైరెక్టర్ తో వరుసగా మూడు సినిమాలు చేసిన హీరోని ఎక్కడైనా చూసారా. నేను కూడా కేవలం మహేష్ తో తీస్తే సరిపోదు, వేరే హీరోలతో కూడా చేసి రావాలి, అందుకే ఇంత గ్యాప్ ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ గుణశేఖర్.