HomeతెలంగాణLok Sabha Election 2024: సెంటిమెంట్‌ను రగలిస్తున్న గులాబీ నేతలు.. వర్కవుట్‌ అవుతుందా?

Lok Sabha Election 2024: సెంటిమెంట్‌ను రగలిస్తున్న గులాబీ నేతలు.. వర్కవుట్‌ అవుతుందా?

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణ సెంటిమెంటు రగిల్చే పనిలో పడ్డారు గులాబీ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను సొట్టపోయిన చందంగా మారిన బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ క్రమంలో తమకు బాగా అచ్చివచ్చిన తెలంగాణ æసెంటిమెంటును రగిల్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ పార్టీలోని తెలంగాణ పదాన్ని తొలగించి.. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు కోసం ప్రయత్నించడమే ఆశ్చర్యంగా ఉంది.

అప్పుడు స్వర్గం.. ఇప్పుడు నరకం అన్నట్లు..
తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్వర్గంలా మార్చామని, ఇప్పుడు కాంగ్రెస్‌ రాకతో నరకంగా మారిందని పేర్కొంటున్నారు గులాబీ ఫాదర్‌ అండ్‌ సన్‌. తమను ఎన్నికలో గెలిపించకపోతే.. తెలంగాణ ఉండదు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఒకరకంగా తెలంగాణ ప్రజలను భయపెడుతున్నారు. తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అవలంబిస్తున్నారు.

యూటీగా హైదరాబాద్‌ అని..
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించకపోతే హైదరాబాద్‌ను యూటీ చేస్తారని పేర్కొంటున్నారు. తమనకు పన్నెండు సీట్లు ఇస్తే.. యూటీ కాకుండా అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు కేటీఆర్‌. ఇక రాజకీయ అవసరం కోసం హైదరాబాద్‌ యూటీ అంశాన్ని కేటీఆర్‌ తెరపైకి తెస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలతో ఉమ్మడి రాజధాని అనే డిమాండ్‌ను కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్‌ రేపే ప్రయత్నం చేశారు. అయితే అది వర్కవుట్‌ కాలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ గోదావరిని మోదీ ఎత్తుకుపోతరంట అని ప్రచారం మొదలెట్టారు. అంటే.. తాను ముఖ్యమంత్రిగా లేకపోవడంతో తెలంగాణలో సాగుత, తాగునీటికి గోస వచ్చిందని అని బెదిరిస్తున్నారు. మొత్తంగా తాము లేకపోతే తెలంగాణ ఉండదు అన్నట్లు సీన్‌ క్రియేట్‌ చేసే పనిలో పడ్డారు. తండ్రీ కొడుకులు.

వర్కవుట్‌ అవుతుందా..
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే.. ఉనికే ప్రశ్నార్థకమవుతుంది అని గ్రహించారు కేసీఆర్, కేటీఆర్‌. ఈ నేపథ్యంలోనే తమకు బాగా కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంటును మళ్లీ తెరపైకి తెస్తున్నా. ప్రజలను భయపెడుతున్నారు. మరోవైపు సర్వేలు బీఆర్‌ఎస్‌కు పెద్దగా స్కోప్‌ లేదని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిలో కనీసం గుర్తించగదగిన సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ వ్యూహం ఎంత వర్కవుట్‌ అవుతుందో కానీ .. పదేళ్ల పరిపాలన తర్వాత నాలుగు నెలల్లోనే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే.. పదేళ్లలో గులాబీ పాలకులు ఏమీ చేయలేదని విపక్షాలు కౌంటర్‌ అటాక్‌ చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular