Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ మేరకు మూడువేల గృహాలు నిర్మించి ఇచ్చారు.
తన నియోజవర్గంలో పేదలు ఎక్కువగా ఉన్నారని.. వారిలో చాలామందికి గృహాలు లేవని ఆయన అప్పట్లో చెప్పారు. తన సొంత ఖర్చులతో గృహాలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే కేంద్ర పథకం ద్వారా ఆయన సుమారు 3000 మంది లబ్ధిదారులకు గృహాలను కట్టించి ఇచ్చారు.. ఆర్మూరు నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రకటిస్తున్నారు. గులాబీ పార్టీ నాయకులకు.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకకాలంలో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తుల బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రాకేష్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బంగారం ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకుల మెడలో నుంచి బంగారాన్ని తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ పోలీసులు కేసులు పెడితే తన వద్దకు రావాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు గృహాలు కట్టించి ఇవ్వకపోతే.. తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తానన్న హామీ మేరకు నియోజవర్గంలో 3000 మంది పేదలకు గృహాలు కట్టించి ఇచ్చినట్టు రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.. కొద్దిరోజులుగా ఆర్మూర్లో రాజకీయంగా రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాకేష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని గులాబీ పార్టీ నాయకులు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలకు ఇప్పటికే రాకేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల మెడలో ఉన్న బంగారాన్ని గుంజుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఇటీవల కాలంలో రాకేష్ రెడ్డి తరచుగా వివాదాస్పద వ్యక్తులు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ నాయకుల మెడలో నుంచి బంగారాన్ని లాక్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసులు పెడితే తన వద్దకు రావాలని కూడా సూచించారు. ఈ ప్రకారం నియోజకవర్గం లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
