CM Revanth Reddy: లోక్సభ ఎన్నికల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ చేయాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. పీసీసీ చీఫ్గా, సీఎంగా ఉన్న రేవంత్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. మెజారిటీ సీట్లు సాధించకపోతే తన పాలనపై ప్రభావం పడుతుందన్న ఆలోచనలో రేవంత్ ఉన్నారు. ఈ క్రమంలో మెజారిటీ సీట్లపై ఫోకస్ పెట్టి, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. తాజాగా బుధవారం(ఏప్రిల్ 10న) భువనగిరి లోక్సభ నియోజకవర్గంపై సమీక్ష చేశారు. ఈ క్రమంలో ఏపీలో జగన్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో వలంటీర్ వ్యవస్థ..
ఏపీలో వలంటీర్ వ్యవస్థపై చర్చ కొనసాగుతోంది. వైఎస్.జగన్ సీఎం అయ్యాక వలంటీర్ వ్యవస్థను తెచ్చారు. దీనిపై విపక్ష టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమి తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే అవి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని గుర్తించిన విపక్ష పార్టీలు ఇప్పుడు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటిస్తున్నాయి. మరోవైపు వలంటీర్ వ్యవస్థపై ఏపీలో ప్రజలు సానుకూలంగా ఉన్నారు. దీంతో తెలంగాణలో కూడా వలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారు.
36 వేల వలంటీర్లు..
లోక్సభ ఎన్నికల అనంతరం 36 వేల వలంటీర్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో జగన్కు అండగా నిలిచినట్లే.. తెలంగాణలో వలంటీర్లను నియమిస్తే కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుందన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రేవంత్రెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఏపీ తరహాలోనే..
తెలంగాణలో కూడా వలంటీర్లతో వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై ప్రచారం, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా తీసుకోవడం వంటి పనులు చేయించే అవకాశం ఉంది. వలంటీర్లకు ఏపీలో చెల్లిస్తున్నట్లుగానే గౌరవ వేతనం ఇవ్వనున్నాట్లు తెలుస్తోంది. ఈమేరకు అధికారులతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం.