HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్ రెడ్డి నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఆ మహిళా నేత...

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఆ మహిళా నేత వేసిన బాంబు ఇదీ

CM Revanth Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విడుదలైన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రికార్డులు కొల్లగొడుతోంది. అయితే ఘన విజయాన్ని తెలుగు ఇండస్ట్రీ ఎంజాయ్‌ చేయలేకపోతోంది. ముఖ్యంగా సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ సంబరాలకు దూరంగా ఉంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం బెనిఫిట్‌షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనే కారణం. బెనిఫిట్‌ సో చూసేందుకు డిసెంబర్‌ 4న అర్ధరాత్రి అర్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఆమె కొడుకు రోహిత్‌ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో సంధ్య థియేటర్‌ యాజమాన్యంతోపాటు సినిమా హీరో అల్లు అర్జున్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అర్జున్‌ను అరెస్టు కూడా చేశారు. బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడిప్పుడే వివాదం సర్దుకుంటోంది. ఈక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

అక్బరుద్దీన్‌ చిచ్చు..
సంధ్య థియేటర్‌ ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప–2 సినిమా హీరో, నిర్మాత ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చారు. అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అంతా కూల్‌ అవుతుండగా, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ శనివారం అసెంబ్లీలో మానుతున్న గాయాన్ని మళ్లీ రేపారు. బాధితురాలి తరఫున మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం ఈ ఘటనకు పూర్తిగా అల్లు అర్జునే బాధ్యుడని ఆరోపించారు. పలు ఆరోపణలు చేశారు. దీంతో అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్‌ కూడా తన ఇంట్లో ప్రెస్‌మీట్‌ పెట్టారు. తనను బద్నాం చేయాలని చూస్తున్నారని, సమాచార లోపంతో అనుకోకుండా ఘటన జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. ఇక ఎలాంటి సంబంధం లేని ఓయూ జేఏసీ నేతలు హీరో అల్లు అర్జున్‌ ఇంటిపై ఆదివారం దాడి చేశారు. ఈ దాడి వెనుక బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వ్యవహారం మొత్తం రాజకీయ రంగు పులుముకుంది.

సీఎం తీరును తప్పు పట్టిన బీజేపీ నేతలు..
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. హీరో అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అనుకోకుండా జరిగిన ఘటనకు ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర అని బండి సంజయ్‌ ఆరోపించారు. కిషన్‌రెడ్డి కూడా సీఎం వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఎంఐఎం ఎమ్మెల్యేతో కలిసి సీఎం రేవంత్‌ చేసిన కుట్ర అని కేంద్రమంత్రి ఆరోపించారు. అల్లు అర్జున్‌కు బీజేపీ నేతలు అండగా నిలిచారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లు అర్జున్‌ వ్యాఖ్యలను ఖండించారు. సీఎం మాటలను తప్పు పట్టడం సరికాదన్నారు. వెంటనే వెనక్కు తీసుకోవాలని సూచించారు.

ఏపీ టీడీపీ నేత మండిపాటు..
ఇక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై ఏపీ టీడీపీ మహిళా నేత తిరునగరి జ్యోత్స ్న మండిపడ్డారు. అల్లు అర్జున్‌ కేసు విషయంలో ఉన్న ఇంట్రెస్ట్‌.. రాష్ట్రంలోని మిగతా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు. హాస్టళ్లలో విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌ మరణాలకు బాధ్యులు ఎవరని నిలదీశారు. రుణం మాఫీకాక ఆత్మహత్య చేసుకున్న రైతుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఎక్స్‌ వేదికగా నిలదీశారు. సంధ్య థియేటర్‌ ఘటనలో తెలంగాణ సీఎం రేంత్‌రెడ్డి చర్యలను అభినందించారు. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల నేత కార్మికుల అంశంపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. అల్లు అర్జున్‌ మీద చర్చకు సమయం ఉంది కానీ, నేత కార్మికులు, రైతులు, విద్యార్థుల మరణాలపై చర్చకు టైం లేదా అని ప్రశ్నించారు. వీటినే డైవర్షన్‌ పాలిటిక్స్‌ అంటారని మండిపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular