డబుల్ బెడ్రూం ఇళ్లను దశలవారీగా నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని బల్కంపేటలో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివ్రుద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యం పెట్టుకున్నామని, అందుకు తీవ్రంగా క్రుషి చేస్తున్నామన్నారు. పేదల ఆదాయం పెరిగేందుకు కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నడన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు అందేలా చూస్తామన్నారు.