దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందర్రావు బంధువుల ఇళ్లల్లో సోమవారం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన బంధువు అంజన్రావు ఇంట్లో రూ.18.67 లక్షలు లభించాయి. సమాచారం అందుకున్న రఘునందన్రావు, పార్టీ నాయకులు అంజన్రావు ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కాగా స్వాధీనం చేసుకున్న కొంత నగదును బీజేపీ శ్రేణులు లాక్కెళ్లారు.