తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాను ఆయన కలువనున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై వారికి సంజయ్ వివరించనున్నారు. అలాగే గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రులను కలిసి కృతజ్ఞతలు చెప్పనున్నారు. మొన్న వెలువడిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో తెలంగాణలో బీజేపీ బలపడుతోందని తెలపడానికి బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది.