
దుబ్బాకలో ఇప్పటి వరకు సాగిన కౌంటింగ్లో బీజేపీ లీడ్ గానే ఉంటోంది. మొదటి రౌండ్లో 841 ఓట్లతో, రెండో రౌండ్లో 279 ఓట్లు రాగా మూడో రౌండ్ లో 1259 ముందంజలో ఉండగా రెండో రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం 1885 ఓట్లతో ఆధిక్యత సాధించింది. ఇందులోబీజేపీకి 9,223 టీఆర్ఎస్ కు 7,964, కాంగ్రెస్ 1,931 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు దుబ్బాక మండలం ఓట్లు లెక్కింపు పూర్తయింది. తాజాగా మిరుదొడ్డి మండలం ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే మొదటి, రెండు రౌండ్లతో పోలిస్తే రెండో రౌండ్లో ఆధిక్యత తగ్గింది. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దీంతో బీజేపీకి ఆశలు సన్నగిల్లాయి. కానీ ఈవీఎం ఓట్లను లెక్కించేసరికి పరిస్థతి మారిపోయింది. రెండో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కొనసాగడం గమనార్హం.