Chandrayaan-3: అంతరిక్ష కేంద్రం నుంచి పూర్తి తయారీ తర్వాత అంతరిక్ష నౌక భూమి నుంచి చంద్రునిపైకి ప్రయోగిస్తుంటారు. అయితే చంద్రుడిపై దిగిన తర్వాత అంతరిక్ష నౌక తిరిగి భూమికి ఎలా వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
అంతరిక్ష నౌకను ప్రయోగించడానికి భారతదేశంలో రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. మొదటిది కేరళలోని తిరువనంతపురంలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్, రెండవది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఈ స్టేషన్ నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించారు. చంద్రునిపై అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్ష నౌక లాంచర్ లేదు. వ్యోమనౌకను ప్రయోగించడానికి ఎన్ని సన్నాహాలు చేస్తున్నారో వీడియోలలో చూసే ఉంటారు. ముందుగా దానిని రాకెట్తో అసెంబుల్ చేసి, తర్వాత లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు. రెండు, నాలుగు లేదా పది–ఇరవై కాదు.. మొత్తం బృందాలు ఇందులో పనిచేస్తాయి. భూమి గురుత్వాకర్షణ క్షేత్రాన్ని దాటినప్పుడే ఏదైనా ఉపగ్రహం భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లగలదు.
సెకనుకు 11.2 కిమీ వేగంతో..
సైన్స్ నియమాల ప్రకారం, ఏదైనా వస్తువు దాని కనీస వేగం సెకనుకు 11.2 కిలోమీటర్లు ఉన్నప్పుడే భూమి గురుత్వాకర్షణను అధిగమించగలదు. అందుకే అంతరిక్ష నౌకను లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు. తద్వారా అది భూ కక్ష్య నుంచి విజయవంతంగా నిష్క్రమించి అంతరిక్షంలోకి ప్రవేశించగలదు. భూమి నుంచి చంద్రునిపైకి వాహనాలను పంపడానికి అనేక అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి.
క్షేమంగా భూమిపైకి..
చంద్రునిపై అంతరిక్ష కేంద్రం ఇంకా నిర్మించబడలేదు. అయినప్పటికీ, అంతరిక్ష నౌక భూమికి సులభంగా తిరిగి వస్తుంది. ఇది పైకప్పు నుంచి నేలకి దూకడం లాంటిదని మీరు అనుకుంటే, మీరు తప్పులే కాలేసినట్లే. ఎందుకంటే ప్రకృతి సహజ సాంకేతికత దీనికి సహాయపడుతుంది. ఈ మొత్తం గేమ్ భూమి తిరిగే వేగంపై ఆధారపడి ఉంటుంది. భూమి తిరిగే వేగం సెకనుకు 11.2 కిలోమీటర్లు కాగా, చంద్రుడు తిరిగే వేగం సెకనుకు 2.4 కిలోమీటర్లు మాత్రమే. పంపిన వ్యోమనౌకలో ఉన్న ఇంజిన్ చాలా బలంగా ఉంది. ఇది అంతరిక్ష నౌకను సెకనుకు 2.4 కిలోమీటర్ల వేగంతో సులభంగా వేగవంతం చేయగలదు. అంతరిక్ష నౌకను భూమికి సులభంగా తిరిగి రావడానికి సహాయపడుతుంది.