క్రీడలుSanju Samson: ఏడు నెలల తర్వాత బరిలోకి సంజూ శాంసన్.. సత్తా చాటేనా..!

Sanju Samson: ఏడు నెలల తర్వాత బరిలోకి సంజూ శాంసన్.. సత్తా చాటేనా..!

Sanju Samson: టీమిండియా జట్టులో కీలకమైన ప్లేయర్ గా ఎదిగేందుకు అవసరమైన శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యం అపారంగా ఉన్నప్పటికీ.. అదృష్టం కలిసి రాకపోవడంతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు యువ ప్లేయర్ సంజూ శాంసన్. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల సామర్థ్యం ఈ యంగ్ బ్యాటర్ సొంతం. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో.. జట్టులోకి రావడం, పోవడం పరిపాటిగా మారింది. తాజాగా వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు శాంసన్. సుమారు ఏడు నెలల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

టీమిండియాలో అత్యంత ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లలో చెప్పుకోదగిన పేర్లలో తప్పనిసరిగా ఉండే పేరు సంజు శాంసన్. అద్వితీయమైన ఆటతీరుతో అదరగొడుతుంటాడు ఈ యువ ప్లేయర్. ఐపీఎల్ వంటి లీగుల్లో విజృంభించే ఆడే శాంసన్ అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ అవకాశాలు లేకపోవడమే అన్న విమర్శ ఉంది. అయితే వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకో లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యాడు శాంసన్. ఏడు నెలల తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగబోతున్న శాంసన్ ఇప్పుడైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

11 వన్డేల్లో టీమిండియా ప్రాతినిధ్యం..

సంజూ శాంసన్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 11 వన్డేలు ఆడాడు. పది ఇన్నింగ్స్ ల్లో 330 పరుగులు చేశాడు. 66 సగటుతో ఈ పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 86 పరుగులు కాగా ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు 17 టీ20లు ఆడిన సంజూ శాంసన్ 20.7 సగటుతో 31 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని నుంచి భారత క్రికెట్ జట్టుకు సంజూ శాంసన్ ఎంపిక కాలేదు. తాజాగా వెస్టిండీస్ పర్యటనకు సంజూ శాంసన్ ఎంపిక కావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సత్తా చాటాల్సిన అవసరం..

సంజూ శాంసన్ ను వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే తో పాటు టి20 ఫార్మాట్ కు ఎంపిక చేశారు. మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆడనుంది. ఈ పర్యటనకు ఎంపికైన జట్టును పరిశీలిస్తే దాదాపుగా సంజూ శాంసన్ కు తుది జట్టులో చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. తుది జట్టులో చోటు దక్కితే మాత్రం తనలోని ప్రతిభను బయటకు తీసి సత్తాను చాటాల్సిన అవసరం సంజూ శాంసన్ కు ఏర్పడింది. ఈ సిరీస్ లో అదరగొడితే అక్టోబర్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు రోడ్ క్లియర్ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

Related News

Sanju Samson: టీమిండియా పరువు సంజు శాంసన్ చేతిలో..

Sanju Samson: ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఎందుకిలా అవుతుందో తెలియడం లేదు. అసలు ప్రవాహం లాగా పరుగులు సాధించే ఆటగాళ్లు ఇలా ఎందుకు అవుతున్నారో ఎంతకీ అంతు పట్టడం...

India vs England 3rd T20: ఇంగ్లాండ్ తో మూడో టి20.. తెలుగోడికి చోటు కష్టమే.. ఇదీ గౌతమ్ గంభీర్ మార్క్ పక్షపాతం

India vs England 3rd T20: ఇప్పటికే రెండు టి20 లను టీమిండియా కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్లో గెలుపుకు దగ్గరగా వచ్చినప్పటికీ.. బౌలింగ్ లోపం...

Most Popular

FIFA World Cup 2026

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...
Trump FIFA Club World Cup

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...
Rohit Sharma

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్...

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా...
Rohit Sharma

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం...