India vs England, 2nd Test: ఉప్పల్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీమ్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ఆల్ రౌండర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసినపుడు ఎక్స్ట్రా రన్ కోసం పరిగెడుతూ రన్ ఔట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక అదే సమయంలో ఆయన చాలా ఎక్కువ వేగంతో పరుగెత్తడం తో ఆయన తొడ కండరాల్లు పట్టుకున్నాయి. దాంతో ఆయన గ్రౌండ్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా వెళ్ళిపోయాడు.
ఇక ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కి తను అందుబాటులో ఉంటాడా? లేదా అనే విషయం మీద క్లారిటీ రావడం లేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ రవీంద్ర జడేజా నెక్స్ట్ మ్యాచ్ లో ఉంటాడా లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఫిజియో తనని చూసిన తర్వాత ఈ విషయం క్లారిటీగా తెలుస్తుంది అంటూ తను కూడా జడేజా విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఇక జడేజా తొడ కండరాలు పట్టుకున్న కూడా వారం రోజులపాటు రెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకో నాలుగు రోజుల్లోనే రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇక దానికి అందుబాటులో ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
మొదటి మ్యాచ్ లో మిగితా ప్లేయర్ల విషయం పక్కన పెడితే జడేజా మాత్రం బ్యాట్ తో, బాల్ తో రెండింటితో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఇలాంటి ప్లేయర్ లేకపోవడం ఇండియాకి భారీగా మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈయన ప్లేస్ ని ఏ ప్లేయర్ తో రీప్లేస్ చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే మొదటి మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ఓడిపోయి తీవ్రమైన విమర్శలను అయితే ఎదురుకుంటుంది.
ఇక 231 పరుగులను ఛేదించడంలో ఇండియా తడబడటం అనేది నిజంగా బాధాకరమైన విషయం అంటూ సోషల్ మీడియా లో ఇండియన్ టీమ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఒక వంతుకు రవీంద్ర జడేజా ని బెన్ స్టోక్స్ రన్ ఔట్ చేయడంతో ఈ మ్యాచ్ మలుపు తిరిగిందనే చెప్పాలి. ఒక వేళ జడేజా ఔట్ అయి ఉండకపోతే ఈ మ్యాచ్ ని ఈజీగా గెలిపించేవాడు.