spot_img
Homeక్రీడలుక్రికెట్‌India Vs Usa T20 World Cup: అమెరికా పకడ్బందీ ప్రణాళిక.. బిత్తర పోయిన అభిషేక్...

India Vs Usa T20 World Cup: అమెరికా పకడ్బందీ ప్రణాళిక.. బిత్తర పోయిన అభిషేక్ శర్మ, శివం దుబే

India Vs Usa T20 World Cup: ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. శివం దుబే సత్తా చూపించాడు. వీరిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో అదరగొడతారని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇద్దరు సున్నా పరుగులకు ఔట్ అయ్యారు.

అభిషేక్ శర్మ ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అటువంటి ఆటగాడు తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కావడం సంచలనం కలిగించింది. వాస్తవానికి ఏ జట్టు కూడా తొలి ఓవర్లలో ఎక్స్ ట్రా డీప్ కవర్ లో ఫీల్డర్ ను పెట్టదు. కానీ అమెరికా కావాలని ఆస్థానంలో ఫీల్డర్ ను పెట్టింది. దీంతో అభిషేక్ శర్మ వాన్ షాక్ విక్ బౌలింగ్ లో తొలి బంతికే అవుట్ అయ్యాడు.

అభిషేక్ శర్మ అలా అవుట్ కావడంతో టీమిండియాలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడిపోయాయి. ఈ దశలో అభిషేక్ శర్మ ఉదంతాన్ని పాఠంగా తీసుకోవలసిన శివం దుబే లాంటి ఆటగాడు కూడా అలానే అవుట్ కావడం దిగ్బ్రాంతి కలిగించింది. శివం దుబే ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడు అందరికీ తెలుసు
అందువల్లే అమెరికా పకడ్బందీ ప్రణాళికతో అతడిని కూడా ఔట్ చేసింది. వాస్తవానికి టి20 ఫార్మాట్ లో ఆటగాళ్లు ముందుగా బంతులను పరీక్షించుకుంటారు. ఆ తర్వాత దూకుడు మొదలుపెడతారు. కానీ అమెరికా మీద భారత బ్యాటర్లు అలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా అమెరికా బౌలర్లు పై చేయి సాధిస్తున్న సమయంలో.. వారి ఎత్తులకు తలవంచారు. తద్వారా టీమిండియా ప్రమాదకరమైన ప్లేయర్లు అభిషేక్ శర్మ, శివం దుబే లాంటి ప్లేయర్లు 0 పరుగులకు అవుట్ అయ్యారు.

శివం దుబే, అభిషేక్ శర్మ మాత్రమే కాదు.. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్యా(5) ఒంటి ప్లేయర్లు కూడా సింగల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. అక్షర్ పటేల్ (14) కూడా అమెరికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు. తద్వారా టీమిండియా అంచనాలకు మించి స్కోర్ చేయలేకపోయింది. సూర్య కుమార్ యాదవ్ (84*) అదరగొట్టడంతో టీమిండియా అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. భారత జట్టు 161 పరుగులు చేస్తే.. అందులో సూర్యకుమార్ యాదవ్ చేసినవే 84 పరుగులు ఉన్నాయంటే.. అతని బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper