40 Crore Scam in Hyderabad Cricket Association : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ అసోసియేషన్కు అన్ని రకాల హంగులు ఉన్నా కూడా.. అధోగతిలాగే ఉంది. ఈ అసోసియేషన్ లో పెద్దల మధ్య చాలా కాలంగా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచులే పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్ పూర్తి అగమ్య గోచరంగా మారిపోయింది.
తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు పోటీపడడం.. తోపులాట.. 20 మందికి గాయాలు, ఒకరు మరణించారన్న వార్త హెచ్.సీ.ఏకు చెడ్డ పేరు తీసుకువచ్చింది. 2019 తర్వాత హైదరాబాద్లో మ్యాచ్ జరగలేదు. కోవిడ్ తో రెండేళ్లు అసలే క్రీడలే లేవు. ఈక్రమంలోనే చాలా రోజుల తర్వాత మ్యాచ్ కావడంతో అభిమానులు ఎగబడ్డారు. దాదాపు 40వేల కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియంలో టికెట్లకు కేవలం ఒక కౌంటర్ పెట్టారు. అందులో కేవలం 3వేల సీట్లు మాత్రమే అమ్మారని అంటున్నారు. మరి మిగతా సీట్లు ఏం చేశారు? బ్లాక్ లో అమ్ముకున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
దాదాపు 40వేల కెపాసిటీ గల ఈ స్టేడియంలో ఒక్కో సీటును పెద్దది చిన్నది కలిపి ఓవరాల్ గా 1000 రూపాయలు ఒక్కోటి చొప్పున లెక్క వేసుకున్నా మొత్తం రూ. 40 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ టికెట్ల డబ్బులే కాదు.. ఇంకా కూడా అసోసియేషన్ ఆదాయ వ్యయాల్లో గోల్ మాల్ జరిగిందని.. అజారుద్దీన్ తోపాటు పాలకవర్గం సభ్యులు తన్నుకు చస్తున్నారు. దీన్ని బట్టి మొత్తం ఈ సంఘమే అవినీతితో భ్రష్టు పట్టిందని చెప్పకతప్పదు.
ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మారకపోతే.. ఇలాంటి మరకలు అంటించుకోకపోతే మనకు మ్యాచ్ లు దక్కుతాయి. లేదంటే ఉన్న మ్యాచ్ లు కూడా తరలిపోవడం ఖాయమంటున్నారు.