కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేదలు, వృద్ధులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇప్పటికే ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం 2019 సంవత్సరం నుంచి ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ ద్వారా కేంద్రం పేదలు, వృద్దులకు నెలకు 3,000 రూపాయల చొప్పున సాయం అందించడానికి సిద్ధమైంది. దేశంలోని 45 లక్షల మంది ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరారు.
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ప్రయోజనం కల్పిస్తోంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. నెలసరి వేతం 15,000 రూపాయల కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ స్కీమ్ ద్వారా వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. కామన్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించి ఈ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ సహాయంతో ఈ స్కీమ్ లో చేరవచ్చు.
ఈ స్కీమ్ కింద ఖాతా జరిగిన ప్రతి ఒక్కరికీ కార్మికుడికి శ్రామ్ యోగి కార్డు ఇవ్వబడుతుంది. 1800 – 267 – 6888 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని కామర్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.